దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,488 కరోనా కేసులు నమోదుకాగా 249 మంది మృతి చెందారు. కొత్త కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకోగా.. యాక్టివ్​ కేసులు 534 రోజుల కనిష్ఠానికి చేరాయి.











  • మొత్తం కేసులు: 3,45,18,901‬

  • మొత్తం మరణాలు: 4,65,911

  • యాక్టివ్​ కేసులు: 1,18,443

  • మొత్తం రికవరీలు: 33,934,547


తాజాగా 12,510 మంది కరోనాను జయించారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.34%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యల్పం.

 

శాంపిళ్లు..

 

ఇప్పటివరకు 63,25,24,259 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఆదివారం 7,83,567 శాంపిళ్లు పరీక్షించారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది (ఐసీఎంఆర్).

 

కేరళ..

 

కేరళలో కొత్తగా 5080 కేసులు నమోదుకాగా 40 మంది మృతి చెందారు. 7908 మంది కరోనా నుంచి కోలుకున్నారు.