ABP  WhatsApp

Punjab Blast: ఆర్మీ క్యాంప్ ఆఫీస్ వద్ద గ్రనేడ్ బ్లాస్ట్.. అధికారులు హైఅలర్ట్

ABP Desam Updated at: 22 Nov 2021 10:14 AM (IST)
Edited By: Murali Krishna

పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంప్ వద్ద గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్మీ క్యాంప్ ఆఫీస్ వద్ద గ్రనేడ్ దాడి

NEXT PREV

పంజాబ్​ పఠాన్‌కోట్​లోని ఆర్మీ క్యాంప్ వద్ద గ్రనేడ్ పేలుడు కలకలం రేపింది. ధీరాపుల్​ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్​ ఎదుట ఈ రోజు ఉదయం పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.







పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు త్రివేణి గేటు వద్ద గ్రెనేడ్ పేలుడు జరిగింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. సీసీటీవీ పుటేజిని పరిశీలిస్తున్నాం.                                             -   సురేంద్ర లాంబా, పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పీ


ఎలా జరిగింది?


గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి గ్రనేడ్​ను విసిరి పారిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఓ వివాహం జరుగుతోందని పేర్కొన్నాయి. గ్రనేడ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన.. గ్రనేడ్ పదార్థాలను సేకరించినట్లు తెలిపారు. పఠాన్​కోట్​లోని అన్ని పోలీస్​ చెక్​పోస్ట్​లను అప్రమత్తం చేశారు.


ఆ ఘటనలో..


2016 జనవరి 1 అర్ధరాత్రి దాటాక భారత ఆర్మీ దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పఠాన్‌కోట్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. నాలుగు రోజులకు ఆపరేషన్ ముగిసింది.


ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఐదుగురు సాయుధులు హతమయ్యారని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న మిలిటెంట్ గ్రూప్ జైషే మహ్మద్ పనేనని భారత్ తేల్చింది. 


Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు


Published at: 22 Nov 2021 10:08 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.