కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​భారత్​లో క్రమంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా ఏడు ఒమిక్రాన్​కేసులు నమోదయ్యాయి. ఈ ఏడు కేసుల్లో ముంబయిలో 3, పింప్రి చించ్వాడా మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో 4 కేసులు వచ్చాయి. ముంబయి ధారావికి టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో  17, రాజస్థాన్ లో 9, గుజరాత్ లో​3, కర్ణాటకలో 2, దిల్లీలో 1 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 


Also Read: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు


Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...






భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే 10 ఒమిక్రాన్  కేసులు వెలుగుచూశాయి. తాజాగా మరో 7 కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17కి చేరింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలను తప్పక పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువైతే మరో వేవ్ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించాయి.


Also Read: దేశంలో కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు 624 మంది మృతి


Also Read: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం


Also Read: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి