ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,643 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 121 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,479కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 228 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,728 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1597 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,804కి చేరింది. గడచిన 24 గంటల్లో 228 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,479కు చేరింది. 


Also Read: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు


దేశంలో కరోనా కేసులు 


దేశంలో కొత్తగా 7,081 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 83,913కు చేరింది. 570 రోజుల్లో ఇదే అత్యల్పం. నిన్న ఒక్కరోజే 12 లక్షల కరోనా శాంపిళ్లను పరీక్షించారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.24గా ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యల్పం. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 137 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 


Also Read: ఆదర్శంగా అండమాన్ నికోబార్ దీవులు.. సవాళ్లను దాటి 100% వ్యాక్సినేషన్


ఒమిక్రాన్


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 143కు పెరిగింది. కర్ణాటకలో కొత్తగా 6 కేసులు నమోదుకాగా కేరళలో 4 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 12 కేసులు నమోదుకాగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటివరకు 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. మహారాష్ట్ర (48), దిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (7), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1), బంగాల్ (1) కేసులు నమోదయ్యాయి.


Also Read: : కేరళ అలప్పుజలో 144 సెక్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి