వెండితెరపై నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. ఆయన హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 టీఆర్పీతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. ఇంతకాలానికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. తన భుజాలపై ఈ షోని నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్ లో కూర్చున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 


Also Read: 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్..


సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్న వరకు రీచ్ అవ్వలేదు. కానీ తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్‌ కోటి రూపాయలు గెలుచుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చినప్పటికీ.. సదరు వ్యక్తి వివరాలను బయటపెట్టలేదు. కొన్ని రోజుల్లో ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. 


ఇక ఈ షోలో సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా కనిపిస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, సమంత, కొరటాల శివ, రాజమౌళి ఇలా చాలా మంది అగ్ర తారలను గెస్ట్ లుగా తీసుకొచ్చి.. తన ప్రశ్నలతో ఓ ఆట ఆడేసుకున్నారు ఎన్టీఆర్. బ్రిటన్ కి చెందిన ఈ షోని ఇండియాలో అన్ని భాషల్లో అడాప్ట్ చేసుకొని టెలికాస్ట్ చేస్తున్నారు. తెలుగులో కొత్త సీజన్ ఆగస్టు 2021 నుంచి ప్రసారమవుతోంది. 



Also Read: యంగ్ హీరోలు.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ..



 


Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..