హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య బాబు.. నిర్మాత‌లు ఎవ‌రో తెలుసా?
హ‌రీశ్ శంక‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. క‌ర్నాట‌క‌కు చెందిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ హ‌రిశ్ శంక‌ర్ కి బ‌ర్త్  డే విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ గురించి ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ మొద‌లైంది. అదే హ‌రీశ్ శంక‌ర్, బాల‌య్య బాబు సినిమా. ఇక ఆ సినిమాకి క‌ర్నాట‌క‌కు చెందిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ్యూస్ చేస్తోంది అని టాక్ గ‌ట్టిగా న‌డుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కొత్త దర్శకులతో పనిచేయనని తేల్చిచెప్పిన విజయ్ దేవరకొండ - ఎందుకంటే?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. పరశురామ్‌తో విజయ్ రెండోసారి కలిసి చేస్తున్న చిత్రమే ‘ఫ్యామిలీ స్టార్’. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో విజయ్ బిజీ అయిపోయాడు. తెలుగుతో పాటు తమిళ మార్కెట్‌పై కూడా ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే తమిళ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ క్రమంలో తను అసలు కొత్త దర్శకులతో పనిచేయనని తేల్చిచెప్పాడు విజయ్. దాని వెనుక కారణమేంటో కూడా బయటపెట్టాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'తలైవర్ 171' నుంచి ఆసక్తికర అప్డేట్ - అలాంటి పాత్రలో రజినీకాంత్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తన కెరీర్‌లోని 171వ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి లోకేశ్ కనకరాజ్‌ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో లోకేశ్ కనకరాజ్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక రజినీకాంత్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి అప్పుడే ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ మూవీలో రజినీ పాత్ర గురించి పలు రూమర్స్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


స్టార్ హీరోల రేంజ్‌లో దుమ్ము రేపుతున్న టిల్లన్న - ‘టిల్లు స్క్వేర్’ రెండో రోజు కలెక్షన్స్!
ఒక సినిమా హిట్ అయినా అవ్వకపోయినా.. దానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడం కంటే హిట్ అయిన సినిమా సీక్వెల్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కష్టం. కానీ ‘టిల్లు స్క్వేర్’ మాత్రం ఇందులో పూర్తిగా సక్సెస్ అయ్యింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’కు రోజురోజుకీ పాజిటివ్ టాక్‌తో పాటు కలెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఈ మూవీ ఇదే రేంజ్‌లో రన్ అయితే వెంటనే బ్రేక్ ఈవెన్ కూడా దాటిపోయి లాభాలు రావడం గ్యారెంటీ అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఫుల్ స్వింగ్‌లో ప్రశాంత్ వర్మ - ‘జై హనుమాన్’ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్!
2024 సంక్రాంతికి టాలీవుడ్‌కి తగిలిస స్వీట్ షాకుల్లో ‘హనుమాన్’ ఒకటి. ఈ సినిమా ఒక రేంజ్ వరకు హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ మీడియం రేంజ్ సినిమాల్లో బాహుబలి లెవల్ బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఏకంగా రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు అందించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ‘హనుమాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ కూడా ప్రకటించారు. ఏదో నామ్ కే వాస్తే ప్రకటనలా కాకుండా సీరియస్‌గా దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ అయి ప్రీ-ప్రొడక్షన్ కూడా ప్రారంభించామని ప్రకటించారు. ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)