ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?


బుల్లితెరపై ఒకానొక సమయంలో ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా ఉదయ భాను (Udaya Bhanu) కనిపించేవారు. ఈటీవీ, జెమిని, మాటీవీ, జీ తెలుగు... ఒక్కటేమిటి? అన్ని ఛానళ్లలో ప్రోగ్రామ్స్ చేశారు. వెండితెరపై కూడా ఆమె సందడి చేశారు. పెళ్లి, పిల్లలు... కుటుంబ బాధ్యతల కారణంగా నటనకు కొన్నాళ్ళు విరామం ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం మళ్ళీ యాంకరింగ్ స్టార్ట్ చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలిసింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది!  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?


సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సోమవారం రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఎప్పటిలా ఆయన హ్యాండ్సమ్ గా ఉన్నారు. అంతేనా? ఫోటోలు చూస్తే... ఎంతో సరదాగా కనిపించారు. టీనేజ్ కుర్రాడిలా ఎంజాయ్ చేశారని అర్థం అవుతోంది. పదకొండేళ్ల కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni)తో కలిసి తాను అటెండ్ అయిన ఫస్ట్ పార్టీ ఇదేనంటూ సోషల్ నమ్రత సైతం పోస్ట్ చేశారు. అసలు, ఇంతకీ వీళ్ళు వెళ్ళింది ఎవరి పార్టీకో తెలుసా?  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!


భారతీయ ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్' ఓ సంచలనం. కియారా అడ్వాణీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా నటించిన శృంగార సన్నివేశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విమర్శలు, వివాదాలతో పాటు ప్రశంసలు సైతం అందుకుంది. గతం గతః. 'లస్ట్ స్టోరీస్' తర్వాత బోల్డ్ సీన్స్ ఉన్న సిరీస్‌లు వచ్చాయి. అయితే... దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళకు గుడ్ న్యూస్! ఈ నెలాఖరున 'లస్ట్ స్టోరీస్ 2' రాబోతోంది. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


కార్తి బ్లాక్ బస్టర్ ‘ఆవారా’ సీక్వెల్ రాబోతోంది - హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?


కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ  ప్రధాన పాత్రలో, డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, ఎంటర్ టైనర్ ‘పయ్యా’. తెలుగులో ఈ సినిమా ‘ఆవారా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2010 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళంతో పాటు తెలుగులోనూ చక్కటి విజయాన్ని దక్కించుకుంది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మాస్ దర్శకుడి పుట్టిన రోజు - ఎన్టీఆర్ స్పెషల్ వంటకం, అదేంటో తెలిస్తే నోరు ఊరడం ఖాయం


Jr NTR: సౌత్ ఇండియన్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రశాంత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జూన్ 4 న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రెటీలు ఆయనకు బర్త్ డే విసెష్ చెప్పారు. హీరో ప్రభాస్ ‘సలార్’ సెట్స్ లో జరిగిన బర్త్ డే వేడుకల్లో ప్రశాంత్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రశాంత్ కు విసెష్ చెప్పారు. అయితే ఎన్టీఆర్ విసెష్ తో సరిపెట్టకుండా ప్రశాంత్ కు ఓ సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రశాంత్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)