'కుర్చీని మడతపెట్టి' వచ్చేసింది - పాటలో మహేష్ డైలాగ్ బోనస్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీని మడతపెట్టి...' సాంగ్ లిరికల్ వీడియో ఇవాళ విడుదలైంది. ప్రోమో విడుదల చేసినప్పటి నుంచి 'కుర్చీని మడత పెట్టి...' పదం వాడకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది సినిమాకు బోలెడంత ప్రచారం తీసుకు వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాలీవుడ్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసింది, ‘యానిమల్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
యానిమల్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు బీ టౌన్ లో మార్మోగిపోతుంది. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన మేకింగ్ తో మూడో సినిమాకే పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో డెబ్యూ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా అదే సినిమాని 'కబీర్ సింగ' పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా అందరి దృష్టిని ఆకర్షించి తన సత్తా చాటాడు. ‘యానిమల్’ రిలీజై 4 వారాలు అవుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటోంది. యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజా ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమాపై బాలీవుడ్ వాళ్లు చేసిన విమర్శలపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను వెల్లడించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'కుర్చీ మడత పెట్టి' సాంగ్ పై ట్రోల్స్ - స్పందించిన నిర్మాత!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా థర్డ్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు అదిరిపోయియాయి. ఇదిలా ఉంటే థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియా అంతట ఈ సాంగ్ పై ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడత పెట్టి' అనే డైలాగ్ తో రకరకాల పాటలు వచ్చాయి. ఇప్పుడు అదే సాంగ్ ని మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


హీరో విజయ్‌పై చెప్పుతో దాడి - అజిత్ ఫ్యాన్స్ నుంచి ఊహించని స్పందన, వాడిని పట్టుకుంటారట!
సినీ పరిశ్రమలో ఫ్యాన్ వార్స్ సహజం. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరోను, తన సినిమాలను కించపరిచినట్టుగా మాట్లాడడం కామన్‌గా మారిపోయింది. ఇక కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఓవైపు అజిత్ ఫ్యాన్స్, మరోవైపు విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత గొడవలు పడుతూనే ఉంటారు. కానీ మొదటిసారి అజిత్ ఫ్యాన్స్ విజయ్‌కు అండగా నిలబడ్డారు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరయిన విజయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి చెప్పుతో కొట్టాడు. దీంతో ఈ స్టార్ హీరోకు ఘోరమైన అవమానం జరిగింది. అయితే దాని వెనుక ఎవరు ఉన్నారో కనిపెడతామని అజిత్ ఫ్యాన్స్.. విజయ్‌కు మాటిచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పురాణ ఆయుధాలే గన్స్‌లా మారితే? ‘కల్కి’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD'. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రభాస్‌ ‘సలార్‌’ సూపర్ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)