Animal Producer Pranay Reddy Vanga Interview : యానిమల్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు బీ టౌన్ లో మార్మోగిపోతుంది. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన మేకింగ్ తో మూడో సినిమాకే పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో డెబ్యూ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా అదే సినిమాని 'కబీర్ సింగ' పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా అందరి దృష్టిని ఆకర్షించి తన సత్తా చాటాడు. ‘యానిమల్’ రిలీజై 4 వారాలు అవుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటోంది.


ఇప్పటి వరకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.860 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యంత కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో చాలామంది సినీ విశ్లేషకులు ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయినా కూడా అవేవీ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ సోదరుడు, యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజా ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమాపై బాలీవుడ్ వాళ్లు చేసిన విమర్శలపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను వెల్లడించాడు.


"బాలీవుడ్ మీడియా మా బ్రదర్ సందీప్ రెడ్డి విజయాలను అసలు జీర్ణించుకోలేకపోతుంది. ‘కబీర్ సింగ్’ సినిమా నుంచి బాలీవుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రతినిధులు గ్రూపుగా ఫామ్ అయ్యి, మా బ్రదర్ ని టార్గెట్ చేశారు. సందీప్ సినిమాలు సక్సెస్ అవుతున్నా గాని వాళ్లు ఒక సౌత్ నుంచి వచ్చిన కుర్రోడు, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ రకంగా విజయాలతో వెళ్లడం వాళ్లకు నచ్చటం లేదు. ఈ క్రమంలో రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాటిని మేం పెద్దగా పట్టించుకోము. తెలుగులో అటువంటి మీడియా గోల ఎక్కడా లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సందీప్ ని బాగా టార్గెట్ చేశారు. బాలీవుడ్ మీడియా రంగంలో మాకు టీ సిరీస్ తో పాటూ ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నా కూడా కొంతమంది మాత్రం.. మా బ్రదర్ విజయవంతంగా రాణించటం తట్టుకోలేకపోతున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.


దీంతో ప్రణయ్ రెడ్డి వంగ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రీసెంట్ గా సందీప్ రెడ్డివంగా కూడా బాలీవుడ్ సినీ క్రిటిక్స్ పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ లో ఓ సినీ క్రిటిక్స్ టీం ఉందని, వాళ్ళు కేవలం ఒకే రకమైన సినిమాలను ఇష్టపడతారని, మిగతా సినిమాలకు బ్యాడ్ రివ్యూస్ ఇస్తుంటారని, అర్జున్ రెడ్డి విషయంలోనూ అదే జరిగిందని అన్నాడు. ఇక యానిమల్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ తన తదుపరి ప్రాజెక్ట్ 'స్పిరిట్' మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.


Also Read : ‘వ్యూహాం’ను మడిచి పెట్టుకోమనండి, వాళ్లంతా పోరంబోకులు - ఆర్జీవీపై బిగ్ బాస్ శివాజీ కామెంట్స్