బుల్లితెరలో ప్రసారం అయ్యే రియాలిటీ షోలు ఏ మాత్రం తగ్గకుండా, ఆ మాటకు వస్తే... మరింత జనరంజకంగా సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' షోను 'ఆహా' ఓటీటీ వేదిక రూపొందించింది. హాట్ షాట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, హీరోయిన్ నిత్యా మీనన్‌ల‌ను న్యాయ నిర్ణేతలుగా తీసుకొచ్చింది. 


Megastar Chiranjeevi to grace Telugu Indian Idol Grand Final: తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరకు వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. గ్రాండ్ ఫినాలేకు మెగా టచ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా తీసుకు వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తనదైన శైలిలో యువ గాయనీ గాయకుల (కంటెస్టెంట్ల) తో చిరంజీవి ముచ్చటించారని, కొన్ని చమక్కులు విసిరారని తెలిసింది. త్వరలో చిరంజీవి అతిథిగా వచ్చిన విషయాన్ని వెల్లడించవచ్చు. 


Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ






ఇటీవల నట సింహం నందమూరి బాలకృష్ణను కూడా 'తెలుగు ఇండియన్ ఐడల్' షోకి ఆహా తీసుకొచ్చింది. ఆ ఎపిసోడ్ జూన్ 10న స్ట్రీమింగ్ కానుంది. ఆల్రెడీ విడుదలైన బాలయ్య ప్రోమో ప్రజలను ఆకట్టుకుంది. ముఖ్యంగా 'భార్యను ఏమార్చడానికి 30 సూత్రాలు' అని పుస్తకం రాశానని చెప్పడం... ఆ తర్వాత ఆయన డైలాగులు ఆకట్టుకున్నాయి. 


Also Read: సీక్రెట్‌గా హైదరాబాద్ చేరుకున్న సల్మాన్ - నెలరోజుల పాటు ఇక్కడే!