క్కినేని నాగార్జున తాజాగా హిందీలో నటించిన సినిమా ‘బ్రహ్మాస్త’. దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో విడుదలై థియేటర్లలో జనాలను అలరిస్తోంది. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో నాగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 23న కేవలం రూ. 75తో ‘బ్రహ్మాస్త’ సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.






కరోనా మహమ్మారి తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మళ్లీ ట్రాక్ లోకి వస్తోంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సినిమాకు పరిశ్రమకు మరింత జోష్ తీసుకొచ్చేందుకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 23న ఈ వేడుకను జరుపబోతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్ ఇస్తోంది. ప్రేక్షకుడు కేవలం రూ. 75తో సినిమా చూడవచ్చని ప్రకటించింది.


ఈ స్పెషల్ ఆఫర్ ను ‘బ్రహ్మాస్త్ర’ సినిమా యూనిట్ బాగా ప్రచారం చేస్తోంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇంకా వసూళ్లు సాధించాలంటే ప్రేక్షకులు థియేటర్లకు ఇంకా రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ. 75 టికెట్ ఆఫర్ ఈ చిత్రానికి మరింత ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది.  వాస్తవానికి ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి మంచి వసూళ్లనే సాధిస్తోంది. రాబోయే వారాల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టాలని మల్టీ ప్లెక్స్‌ లు భావిస్తున్నాయి. ఇందుకోసం స్పెషల్ ఆఫర్ చక్కగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ ఫాంటసీ 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ' గత వారాంతంలో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ప్రముఖ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. $28.2 మిలియన్లు అంటే భారత కరెన్సీలో రూ. 224 కోట్లు వసూలు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించబడిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది. ఈ చిత్రం భారతదేశంలో 5,019 స్క్రీన్‌లలో విడుదలైంది. వారాంతంలో రూ. 125 కోట్ల వసూలుతో నంబర్ 1 స్థానంలో నిలిచింది. సినిమా ఓవర్సీస్ 3,894 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది.


వాస్తవానికి భారతదేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబర్ 16న నిర్వహించనున్నట్లు MAI ప్రకటించింది. కానీ, కొన్ని కారణాలతో ఈ నెల 23కు వాయిదా వేసింది.  ఈ వేడుకల నేపథ్యంలో కేవలం రూ. 75కే  సినిమా టిక్కెట్లను అందించాలని నిర్ణయించింది.   ఈ నెల 23న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రాబోతున్నారు. 


Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 



Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!