సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ఇంతలోనే మళ్లీ కరోనా కేసులు మొదలయ్యాయి. దీనికి తోడు ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ ప్రజలను వణికిస్తోంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా కమల్ హాసన్, కరీనా కపూర్, నటుడు అర్జున్ ఇలా చాలా మందికి కరోనా సోకింది. వారు ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డారు. ప్రముఖ కమెడియన్ వడివేలు కూడా కరోనా బారిన పడ్డారు. 


ఆయన ఒమిక్రాన్ సోకిందేమోనని టెస్ట్ లు చేస్తున్నారు డాక్టర్లు. ఇదిలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతవారంలో తనను కలిసి ప్రతి ఒక్కరూ వెంటనే టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారాయన. తన విషయంలో ఆందోళన పడొద్దని ఫ్యాన్స్ కి చెప్పారు. మీ అందరి ప్రేమలో ఆరోగ్యంగా తిరిగి వస్తానని.. డాక్టర్లు, నర్స్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. 


మంచు మనోజ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మంచు మనోజ్ కెరీర్ ఆరంభంలో కొన్ని హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత డీలా పడ్డారు. తన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు మంచు మనోజ్. మొన్నామధ్య 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఊసే లేదు.  






Also Read:'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీ..


Also Read:'ఆర్ఆర్ఆర్' నిర్మాత కష్టాలు.. బయ్యర్ల డిమాండ్స్ కి తలొంచుతారా..?