తమిళ స్టార్ హీరో సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో సూర్య మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 


కోలీవుడ్ స్టార్ సూర్య పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలు విభిన్నమైన సినిమాలతో సౌత్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు తెలుగులో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తో మాయ చేసి పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. ప్రస్తుతం తన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా 'కంగువ' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. 'కంగువ' తర్వాత సూర్య ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. తాత్కాలికంగా ఈ సినిమాకు 'సూర్య 44'నే టైటిల్ ను పెట్టగా కేవలం ఐదు నెలల్లో ఈ సినిమా నిర్మాణాన్ని ముగించారు. 'సూర్య 44'లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సూర్య పుట్టినరోజు కానుకగా ఇప్పటికే చిత్రబృందం ఒక గ్లింప్స్‌ను విడుదల చేసింది. అయితే దాన్ని చూశాక అందరూ 'సూర్య 44' ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అన్పించింది అంటూ కామెంట్స్ చేశారు. అంతే కాదు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని మొదటి నుండి అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి స్పందిస్తూ దర్శకుడు షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.


Read Also: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే



కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ “నేను ఏదైనా సినిమా చేస్తుంటే జనాలు దాన్ని గ్యాంగ్‌స్టర్ చిత్రంగా భావిస్తారు. అయితే నిజానికి 'సూర్య44' గ్యాంగ్‌స్టర్ చిత్రం కాదు. ఇదొక ప్రేమకథ. యాక్షన్‌ ఎక్కువగా ఉంటుంది, అయితే ప్రేమకథే సినిమా ప్రధానాంశం. చాలా ఏళ్లుగా లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. సూర్య సర్, పూజా హెగ్డే బోర్డ్‌లోకి రావడంతో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను'' అంటూ ఈ మూవీ అసలు గ్యాంగ్ స్టర్ డ్రామా కాదన్న విషయాన్ని వెల్లడించారు. "ఖచ్చితంగా సినిమాలో యాక్షన్ ఉంది. కానీ ఇది గ్యాంగ్‌స్టర్‌కి సంబంధించిన చిత్రం కాదు. ఇది గ్యాంగ్‌స్టర్ కథ కాదు. ఈ ఊహాగానాలన్నీ ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు" అంటూ ఈ మూవీ గురించి చక్కర్లు కొడుతున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2025 సమ్మర్‌లో 'సూర్య 44'ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. కాగా ప్రస్తుతం సూర్య అభిమానులు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కంగువ' రిలీజ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


Also Readజైల్లో ఉన్న జానీ మాస్టర్‌కు మద్దతుగా ఆనీ... నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం, కేసు మీద షాకింగ్ కామెంట్స్