దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) సిలబస్‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించింది. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో నీట్‌(యూజీ) పరీక్షను 2024, మే 5న నిర్వహించనున్నారు. కాగా నీట్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.


అయితే బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్‌ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్‌పై పెద్ద ప్రభావమేమీ చూపదని నిపుణులు అంటున్నారు. ఇది విద్యార్థులకు అనుకూలించే అంశమని చెప్పవచ్చు. అయితే సిలబస్‌ను ఆలస్యంగా విడుదల చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సిలబస్‌ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్‌ విద్యార్థుల కన్నా, ఫస్టియర్‌ విద్యార్థులకే అధిక ప్రయోజనం అని నిపుణలు అంటున్నారు.


తొలగించిన పాఠ్యాంశాల వివరాలు ఇలా..


కెమిస్ట్రీ ఇంటర్ ఫస్టియర్‌: పదార్థం స్థితి, హైడ్రోజన్‌, ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ.


కెమిస్ట్రీ సెకండియర్‌: ఘనస్థితి, ఉపరితల రసాయశాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో పాలిమర్లు, కెమిస్ట్రీ.


ఫిజిక్స్ ఫస్టియర్‌: ప్యూర్‌ రోలింగ్‌, కనెక్టింగ్‌ బాడీలు, పాలిట్రోపిక్‌ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బతిన్న డోలనాలు.


ఫిజిక్స్ సెకండియర్‌: పొటెన్షియల్‌, నాన్‌ పొటెన్షియల్‌ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్‌, ఎర్త్‌ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు.


➥ జువాలజీలో యూనిట్‌-2: వానపాములు, యూనిట్‌-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్‌ -10లో జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం.


బోటనీ ఫస్టియర్‌: ప్లాంట్‌ ఫిజియోలజీలో ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్‌, మినరల్‌ న్యూట్రిషన్‌, మార్పొలజీ.


బోటనీ సెకండియర్‌: స్ట్రాటజీస్‌ ఫర్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌.


బోటనీలో కొత్తగా చేర్చినవి: బయో మాలిక్యూల్స్‌, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్‌, లెగుమనీస్‌ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.


NEET UG 2024 Syllabus:



 


ఎంబీబీఎస్ పాస్ మార్కులపై కీలక నిర్ణయం
ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్‌ను ఇటీవల 40 శాతానికి తగ్గించిన నేషనల్ మెడికల్ కమిషన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాతవిధానం ప్రకారం 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని తాజాగా ప్రకటించింది. పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు శుక్రవారం (అక్టోబరు 6న) అధికారికంగా ఓ నోటిఫికేషన్‌ను ఎన్‌ఎంసీ విడుదల చేసింది. సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సు చివరలో అగ్రిగేట్ సబ్జెక్టుల్లో(థియరీ, ప్రాక్టికల్ కలిపి) ఓవరాల్‌గా 50 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణతగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్‌లో ఈ పాస్‌ పర్సంటేజ్‌ను 40 శాతానికి తగ్గిస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎంఈ) పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్‌) మార్గదర్శకాలను సవరించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


ALSO READ:


ఎన్‌సీఈఆర్‌టీలో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), 2024 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(NID)తో పాటు ఆర్‌ఐఈ- షిల్లాంగ్‌, భోపాల్‌, అజ్‌మేర్‌, భువనేశ్వర్‌, మైసూరులో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో సెంటర్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి అక్టోబరు 2న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...