భారత్‌లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ)-2023' నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 35 పార్టిసిపేటింగ్‌ యూనివర్సిటీల్లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బీఎస్సీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. కోర్సుల్లో ఫీల్డ్ సైన్స్, ల్యాబొరేటరీ డేటా సైన్స్, మెడికల్ డేటా సైన్స్ విభాగాలు ఉంటాయి. అక్టోబరు 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.


వివరాలు..


➥ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్


కోర్సు వ్యవధి: మూడేళ్లు 


అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 


➥ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్


కోర్సు వ్యవధి: రెండేళ్లు.


అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం 45 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

సబ్జెక్టులు: ట్రాన్స్‌పోర్ట్‌ ఫినోమినా, కెమికల్ ఇంజినీరింగ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ థర్మోడైనమిక్స్, కెమికల్ రియాక్టర్ ఇంజినీరింగ్, డిజైన్ తదితరాలు.

దరఖాస్తు ఫీజు: రూ.2000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా.

దేశవ్యాప్తంగా పాల్గొంటున్న యూనివర్సిటీలు: వివేకానంద గ్లోబల్ విశ్వవిద్యాలయం, ఎంఏటీఎస్‌ విశ్వవిద్యాలయం (రాయ్‌పూర్), బహ్రా విశ్వవిద్యాలయం (షిమ్లా హిల్స్), ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం (బరేలీ), ఆర్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (బెంగళూరు), సంస్కృతి యూనివర్సిటీ (యూపీ), రయత్-బహ్రా యూనివర్సిటీ (మొహాలి), జీహెచ్ రాయ్‌సోని యూనివర్సిటీ, వేంకటేళ్వర ఓపెన్ యూనివర్సిటీ, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ, మేరీమాతా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, రెనైసెన్స్ యూనివర్సిటీ (మధ్యప్రదేశ్), అపెక్స్ యూనివర్సిటీ (రాజస్థాన్), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, ఏకలవ్య యూనివర్సిటీ, మేడి-క్యాప్స్ యూనివర్సిటీ, పారుల్ యూనివర్సిటీ, సేజ్ యూనివర్సిటీ(భోపాల్), సేజ్ యూనివర్సిటీ (ఇండోర్), మోదీ యూనివర్సిటీ (రాజస్థాన్), మంగలయతన్ యూనివర్సిటీ (అలీఘర్), మంగలయతన్ యూనివర్సిటీ(రాంచీ), ఉషా మార్టిన్ యూనివర్సిటీ, ఓం స్టెర్లింగ్ గ్లోబల్ యూనివర్సిటీ, దేవ్-భూమి యూనివర్సిటీ, ఐటీఎం యూనివర్సిటీ (మధ్యప్రదేశ్), హిమాలయన్ యూనివర్సిటీ (అరుణాచల్ ప్రదేశ్), గీతా యూనివర్సిటీ (పానిపట్), ఏపీ గోయల్ షిమ్లా యూనివర్సిటీ, డాల్ఫిన్ కాలేజ్(పంజాబ్), సిక్కిం ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అస్సామ డౌన్ టౌన్ యూనివర్సిటీ, అన్నై ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్.


ముఖ్య తేదీలు...


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.10.2023.


➥ ప్రవేశ పరీక్ష తేదీ: 29.10.2023.


➥ పరీక్ష ఫలితాల వెల్లడి: 31.10.2023.


Notification


Online Application


Website


ALSO READ:


నీట్‌(యూజీ) సిలబస్‌ తగ్గింపు, ఈ సబ్జెక్టుల్లోనే ఎక్కువ కోత - విద్యార్థులపై తగ్గిన భారం!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) సిలబస్‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించింది. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో నీట్‌(యూజీ) పరీక్షను 2024, మే 5న నిర్వహించనున్నారు. కాగా నీట్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్‌సీఈఆర్‌టీలో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), 2024 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(NID)తో పాటు ఆర్‌ఐఈ- షిల్లాంగ్‌, భోపాల్‌, అజ్‌మేర్‌, భువనేశ్వర్‌, మైసూరులో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో సెంటర్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...