Machilipatnam Crime News : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతి న్యూడ్ వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి ఇటీవల రాత్రి సమయంలో పనిముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో బైక్ పై వచ్చిన యువకులు పోలీసులమని చెప్పి బైక్ పై ఎక్కాలని బెదిరించారు. అందుకు యువతి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు.


అసలేం జరిగింది?   


స్థానికంగా ఉన్న చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనక ఖాళీ స్థలంలోకి యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. యువతిపై దారుణానికి పాల్పడి న్యూడ్ వీడియోలు తీశారు. యువతి ఫోన్ కూడా లాక్కున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని యువతిని బెదిరించారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. ఈ దారుణం జరిగిన తర్వాత రోజు తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఓ యువకుడు తన ఇంటి ముందు నుంచే వెళ్తుండటాన్ని గుర్తించింది యువతి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో ఆ యువకుడ్ని పట్టుకుంది. అనంతరం పోలీసులకు అప్పగించింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని సుకర్లాబాద్ చెందిన నారాయణగా గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


మొబైల్ డేటా ఆధారంగా దర్యాప్తు 


ఈ కేసులో రెండో నిందితుడిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది. ఈ విచారణలో నిందితుడు మాత్రం పోలీసులకు ట్విస్ట్ ఇచ్చాడు. యువతిపై తాను మాత్రమే అత్యాచారానికి పాల్పడ్డానని పోలీసులకు చెప్పాడు. నిందితుడి వద్ద ఉన్న యువతి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  యువకుడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మొబైల్ డేటాతో పాటు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. 


ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్..


వివాహేతర సంబంధాలు వారిద్దరినే కాదు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో హత్య చేయడానికి వెనుకాడటం లేదు. కొన్ని కేసులలో అభం శుభం తెలియని వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటన జరిగింది. భార్య చనిపోవడంతో ఓ వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెకు అదివరకే వివాహమైంది. దాంతో ఆమె ఏకంగా ప్రియుడి మోజులో పడి భర్తను వదిలించుకోవాలని భావించింది. అందుకోసం భర్తను హత్య చేయించాలని, కిరాయి రౌడీల వరకు మ్యాటర్ వెళ్లింది. రౌడీలు తుపాకీతో ఆమె భర్తపై కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


భార్య చనిపోవడంతో వేరే మహిళతో రిలేషన్..


నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తుమ్మడవల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ, హైదరాబాద్‌ లోని వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు బాలకృష్ణ. అయితే ఆమెకు ఇదివరకే వివాహమైంది. ప్రియుడితో కలిసి ఉండాలంటే భర్త కచ్చితంగా ఊరుకోడు. చట్ట ప్రకారంగా ఏమీ చేయలేమని ఆమె భావించింది. అతడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కిరాయి రౌడీలతో హత్య చేయిస్తే తన మీద ఎవరికి అనుమానం రాదని భావించింది.


నిందితులు బాలకృష్ణ అతడి ప్రియురాలు కలిసి గోషామాల్‌కు చెందిన రౌడీ షీటర్ తో సుపారీ మాట్లాడుకున్నారు. తన భర్తను హత్య చేస్తే మూడు లక్షల రూపాయలు ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. ముందుగా అడ్వాన్స్ కింద రెండు లక్షలు కూడా ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకున్న రౌడీ షీటర్ అండ్ గ్యాంగ్ రామస్వామిని హత్య చేసేందుకు చాలా సార్లు  విఫలయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బాలకృష్ణ తన ఇంట్లో ప్లంబర్‌గా పని చేస్తున్న యూసుఫ్ తో రెండోసారి  పన్నెండు లక్షల రూపాయలకు సుపారీ మాట్లాడాడు. ఇందుకోసం అడ్వాన్స్ గా రూ.5 లక్షలు చెల్లించారు నిందితులు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన భర్తను చంపేందుకు తన దగ్గర ఉన్న లక్ష రూపాయలు కూడా ఇచ్చింది. ఈసారి చాన్స్ మిస్ అవ్వకుండా హత్య చేయాలని చెప్పి మరీ అడ్వాన్స్ ఇచ్చారు రామస్వామి భార్య, ఆమె ప్రియుడు. డబ్బులు అందడంతో యూసుఫ్‌ తన స్నేహితులు అబ్దుల్‌ రహమాన్‌పాషా, ఆసిఫ్ ఖాన్‌, జహంగీర్‌ల సహాయంతో గన్ తో స్వామిని చంపేందుకు ప్లాన్ చేశారు. 


Also Read: Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?



Also Read: Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!