అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో వారి నుంచి డ్రగ్స్ కొంటున్న వారినీ రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఏడుగురు వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్న ప్రముఖులు కావడం పోలీసుల్నిసైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా వారు సాగించిన డ్రగ్స్ లావాదేవీలను ఆధారాలతో సహా పోలీసులు కోర్టు ముందు ఉంచారు. 


Also Read:  ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్



డ్రగ్స్‌ను విచ్చలవిడిగా కొనుగోలు చేసిన ఏడుగురు వ్యాపారులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీరికి డ్రగ్స్‌ను ఇవ్వడానికి నెలలో రెండు సార్లు ఓ టీమ్‌ను టోనీ హైదరాబాద్ పంపుతారు. ఓయో రూమ్‌లో  గుర్తు తెలియని వ్యక్తుల పేరుతో రూమ్‌లు  బుక్ చేసుకుని డ్రగ్స్ అమ్మేసి వెళ్లిపోతూంటారు. మొత్తం అరవై మంది యువకులతో  ఈ డ్రగ్స్ అమ్మకాల ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. డ్రగ్స్‌కు బానిసైన వ్యాపారవేత్తలకు ఒక గ్రామ్ కోకైన్‌ను రూ. 20 వేల చొప్పున అమ్మేవారు.ప్రతిసారి పెద్దమొత్తంలో డ్రగ్స్  కొనుగోలు చేసేవారు. గత నాలుగు సంవత్సరాల నుంచి టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. 



అరెస్టయిన వ్యాపారవేత్తల్లో ఒకరైన నిరంజన్ జైన్ 30 సార్లు టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్  తెప్పించుకున్నాడు. నిరంజన్ జైన్ చేసే వ్యాపారం వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉంటుంది. పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనుల కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలలో అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే  పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న  మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండి ఆనంద్ కూడా డ్రగ్స్‌కు బానిసయ్యారు.  వందల కోట్ల టర్నోవర్ తో ఆయన బిజినెస్ నడుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు శశావత్ జైన్, ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి కూడా డ్రగ్స్‌కు బానిసయ్యారు.


Also Read: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు


నిరంజన్ జైన్,  సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. అలాగే మరో ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాల్లో ప్రముఖుడిగా ఉన్న వెంకట్ చలసానిని కూడా అరెస్ట ్చేశారు. భార్గవ్, వెంకట్ కలసి చదువుకుని.. కలసి వ్యాపారాలు చేస్తున్నారు. వందల కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తూ డ్రగ్స్‌కు బానిసయ్యారు. అలాగే మరో వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ ను  కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. కానీ డ్రగ్స్ బారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. చివరికి కటకటాల పాలయ్యారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి