Petrol Price Today: హైదరాబాద్‌లో ఇంధన ధరలు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటర్ రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. 


తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్లు  
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది.  వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.94.14 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌‌ ధర రూ.94.34 గా ఉంది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) స్వల్పంగా తగ్గాయి. 14 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.108.25 కు దిగొచ్చింది. 14 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.65 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లోపెట్రోల్ పై రూ.0.34 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.27 కాగా, డీజిల్‌పై రూ.0.31 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.54 అయింది. 
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 4th March 2022)పై 22 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.51 కాగా, ఇక్కడ డీజిల్ పై 23 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.59 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 33 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.36 అయింది. డీజిల్‌పై 29 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.47 కు ఎగబాకింది.


చిత్తూరు జిల్లాలో ధరలు..
చిత్తూరులో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్‌ లీటర్ ధర ప్రస్తుతం రూ.110.58 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.96.60 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లు దాటిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 


Also Read: Gold Rate Today: గుడ్‌న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధర, కొండెక్కుతోన్న వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ 


Also Read: EPFO E-Nomination: పీఎఫ్‌ డబ్బు కావాలా? ఈ-నామినేషన్‌ చేయండి మరి!