Gold Price On 4th March 2022: ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో  బంగారం ధర రూ.400 మేర పతనమైంది. పసిడికి భిన్నంగా వెండి ధర భగభగ మండుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర (Gold Rates Today In Hyderabad) రూ.440 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,600కి పడిపోయింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.400 మేర పెరగడంతో  హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,500 కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముందు కేజీ వెండి ధర దేశంలో రూ.68 వేలుగా ఉండేది.


ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. విజయవాడలో రూ.440 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 4th March 2022) తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,600 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300కి పతనమైంది. విజయవాడలో వెండిపై రూ.500  తగ్గడంతో 1 కేజీ ధర రూ.72,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ఇదే ధరలో ట్రేడింగ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,300కి పతనమైంది.


ప్రధాన నగరాల్లో బంగారం ధర..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో బులియన్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.400 మేర దిగొచ్చింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,600 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


ప్లాటినం ధర
బంగారంతో పాటు మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.41 పెరిగి 10 గ్రాముల ధర రూ.26,140కి ఎగబాకింది. తెలంగాణ, ఏపీ నగరాల్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,730 అయింది. చెన్నైలో రూ.13 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.25,730కి చేరింది. ముంబైలో రూ.13 తగ్గడంతో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.25,730 అయింది. 


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Petrol Price Today: భగ్గుమన్న క్రూడాయిల్!  అక్కడ  భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు, మీ నగరాల్లో ఇలా 


Also Read: Amaravati What Next : మూడు రాజధానులకు ఇప్పటికీ ఓ మార్గం ! జగన్ ప్లాన్ బీ అమలు చేస్తారా ?