దేశంలో హైదరాబాద్, చెన్నై,ముంబయి, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నాలుగు రోజుల క్రితం స్వల్పంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్న ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కేవలం డీజిల్ ధరలో తాజాగా స్వల్ప తగ్గుదల కనిపించింది.


తెలంగాణలో ఆగస్టు 19న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరుకు రూ.0.22 పైసలు తగ్గి.. రూ.97.74 కు చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.41 పైసలు తగ్గింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.71గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.60 పైసలు తగ్గి రూ.97.62 గా అయింది.


ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.55 కాగా.. డీజిల్ ధర రూ.97.46 గా ఉంది. పెట్రోల్ రూ.0.17 పైసలు పెరగ్గా.. డీజిల్ రూ.0.22 పైసల చొప్పున తగ్గింది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.


నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.0.45 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.22 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.59 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.37గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటూ వస్తున్నాయి.


Also Read: Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్ రెడ్డి.. రావిర్యాల గడ్డ మీద కేసీఆర్ ను ఏమన్నారంటే..


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.25 చొప్పున స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.87 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.03 పైసలు పెరిగి రూ.99.80కు చేరింది.


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.80గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.09 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.28 పైసలు తగ్గి రూ.98.23గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం వరకూ రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు కనిపించగా.. తాజాగా అవి స్వల్పంగా ఉంటున్నాయి.


Also Read: Hyderabad Gang Rape: హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్.. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్లు..


తిరుపతిలో స్వల్ప మార్పులు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజుల క్రితం వరకూ పెద్ద మార్పులు చోటు చేసుకోగా.. తాజాగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. పెట్రోల్ ధర మాత్రం నిలకడగా ఉంది. డీజిల్ రూ.0.20 తగ్గింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.84గా నిలకడగానే ఉండగా.. ఇక డీజిల్ ధర రూ.100.11గా ఉంది.


Also Read: Telangana: కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లే.. ఇప్పుడు వచ్చే జ్వరాలతో జాగ్రత్త.. అన్నీ అలాంటివే కావు: డీహెచ్ వెల్లడి


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 19 నాటి ధరల ప్రకారం 64.55 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.


Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి పసిడి, వెండి ధరలివే..