భారత్‌లో వరుసగా రెండో రోజు కూడా గురువారం నాడు (ఆగస్టు 19) పసిడి ధర పెరిగింది. ఆగస్టు 19న బంగారం ధరలో గ్రాముకు రూ.7 పెరుగుదల కనిపించింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,500 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,500గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర బాగానే పెరిగింది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధర మాత్రం అతి స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. గ్రాముకు రూ.0.10 పైసలు తగ్గింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.63,500 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి ధర గ్రాముకు రూ.0.40 పైసలు తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,200గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 19న పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.10 చొప్పున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,330 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,300 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,200గా పలికింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 19న రూ.44,300 కు పెరిగింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,330గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా స్థిరంగానే ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.68,200 గానే కొనసాగుతోంది.


Also Read: Telangana: కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లే.. ఇప్పుడు వచ్చే జ్వరాలతో జాగ్రత్త.. అన్నీ అలాంటివే కావు: డీహెచ్ వెల్లడి


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 19న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,500ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,640 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.


ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 19న కాస్త పెరిగింది. గ్రాముకు రూ.45 వరకూ పెరిగి ధర రూ.2,396గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,960 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్ రెడ్డి.. రావిర్యాల గడ్డ మీద కేసీఆర్ ను ఏమన్నారంటే..


Also Read: Hyderabad Gang Rape: హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్.. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్లు..