By: Sai Prasad | Updated at : 02 May 2024 03:50 PM (IST)
ఇక నోట్లు, నాణేలూ కనిపించవా..?
Why are coins not used anymore: ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్లాలంటే సూట్కేసు నిండా బట్టలతోపాటు.. కావాల్సినంత డబ్బు బ్యాంకు పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పుడు దాదాపుగా ఎవ్వరికీ లేదు. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచ దేశాలు చుట్టి రాగల ధైర్యం ప్రస్తుత సమాజంలో అందరికీ ఉంది. నగదు రహిత లావాదేవీలు రాజ్యమేలుతున్న కాలంలో బతుకుతున్నాం. డబ్బును క్యారీ చేసి చాలా రోజులైపోయింది అని చెప్పడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఎవరైనా డబ్బులడిగితే ఇప్పుడెవరండీ డబ్బులు జేబులో పెట్టుకు తిరిగేది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వందశాతం నగదు రహిత సమాజం సాధ్యమా అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.
నగదు రహిత లావాదేవీలంటే..
ఆర్థిక లావాదేవీల్లో నోట్లు, చిల్లర నాణాలు వంటి నగదును ఏమాత్రం ఉపయోగించక పోవడాన్ని నగదురహిత లావాదేవీలంటారు. పే పాల్, యాపిల్ పే, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ మొబైల్ పేమెంట్ సర్వీసులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్, క్రిప్టో కరెన్సీ వంటివి ప్రత్యామ్నాయంగా నగదు బదిలీకి వాడుతున్నారు. జనాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.
నగదు రహిత సమాజం..
డిజిటల్ పేమెంట్లు తప్ప నేరుగా డబ్బులు చేత్తో మార్పు చేసుకోవడం పూర్తిగా నిషేధించగలిగితేనే నగదు రహిత సమాజం సాధ్యమవుతుంది. నగదు రహిత సమాజం వంద శాతం వెంటనే సాధ్యం కాకపోయినా ఆ దిశగా ప్రయత్నాలు అయితే ప్రపంచ దేశాలన్నింటిలోనూ సాగుతున్నాయనే చెప్పాలి. బ్యాంకులు, వ్యాపార సంస్థలు, మేధావులు, ప్రజలు డిజిటల్ పేమెంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. లాభదాయకంగా ఉండటంతో ప్రభుత్వాలు సైతం వీటినే ప్రోత్సహిస్తున్నాయి.
స్వీడన్ ముందంజలో..
నగదు రహిత లావాదేవీలని అంచనా వేయడానికి చాలా ప్రమాణాలున్నాయి. వాటి ఆధారంగా స్వీడన్ ఈ విషయంలో ముందంజలో ఉందని నిపుణులంటున్నారు. దాదాపు 15 శాతానికి మినహా ఇక్కడ అంతా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి. దేశం లో చెల్లుబాటులో ఉన్న నగదు మొత్తం విలువ జీడిపిలో ఒక్క శాతం మాత్రమేనట. ఇక్కడి హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఇతర అన్ని వ్యాపార సముదాయాల్లో క్యాష్ అంగీకరించబోమని బోర్డు పెట్టి నిరాకరించే వెసులుబాటు ఉంది. దేశంలో సగానికి పైగా బ్యాంకుల్లో ఆసలు క్యాషే ఉండదు.
ఏంటి లాభం..?
క్యాష్ లావాదేవీలతో పోలిస్తే.. నగదు రహిత లావాదేవీలే సౌలభ్యంగా ఉంటాయని, వాటితో ఆర్ధిక నేరాలు తగ్గించేందుకు సైతం అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు, వాటిని ఇష్టపడే వారు చెబుతారు. ఆర్ధిక వ్యవస్థల డిజిటలైజేషన్తో తమ దైనందిని వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ద్వారా చేసే అలవాటు వినియోగదారుల్లోనూ పెరుగుతోంది. దీంతో సమయం ఆదా అవతోంది. కొన్ని బ్యాంకులు కావాలనే క్యాష్ ట్రాన్సక్షన్స్ అసౌకర్యమైనావిగా తమ కస్టమర్లకి చూపిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుండటంతో బ్యాంకులు వీటిపైనే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని బ్యాంకుల బ్రాంచెస్ మూసేయడం, ఏటీఏమ్ లను ఎత్తేయడం వంటివి కొన్ని దేశాల్లో చేస్తున్నాయి. వీటి ట్రెండ్ ఇప్పట్లో ఆగదని, త్వరలోనే పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు ప్రపంచమంతటా అమలవుతాయని నిపుణులంటున్నారు.
కరోనా పుణ్యమా అని..
ప్రపంచ వ్యాప్తంగా 2020 లో వచ్చి ప్రాణాంతకంగా పరిణమించిన కరోనా మహమ్మారి సైతం నగదు రహిత లావాదేవీలు పెరగడానికి దోహదపడింది. అప్పట్లో అందరూ ఒకరినొకరు ముట్టుకోవడానికి సైతం సంశయించిన నేపథ్యంలో స్పర్శ రహిత, నగదు రహిత లావాదేవీలకోసం చాలా మంది డిజిటల్ పేమెంట్లపైనే ఆధారపడ్డారు. అప్పటి వరకూ వీటిపై అవగాహన లేని వారు సైతం నిర్భంధ పరిస్థితుల్లో వీటికి అలవాటు పడిన పరిస్థితులున్నాయి.
ఇబ్బందులు..
నగదు రహిత లావాదేవీలతో చాలా ఉపయోగాలున్నప్పటికీ.. వీటిని వంద శాతం అమలు చేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉంది.
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్టరయ్యారు!సినిమాలో నటిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్! సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు వైరల్
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !