అన్వేషించండి

RBI Report: 2000 నోటు ఇంకా మీ వద్ద ఉంటే ఏం చేయాలి? ఆర్బీఐ చేసిన సూచన ఏంటీ? చిరిగిన కరెన్సీకి దారేది?

RBI Report: రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ అప్డేట్ ఇచ్చింది. చెలామణి భారీగా తగ్గిందని వెల్లడించింది. సెప్టెంబర్ 2025 నాటికి 5,884 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ₹2000 నోట్ల విలువ భారీగా తగ్గి, ₹5,884 కోట్లకు చేరింది.
  • సెప్టెంబర్ 2023 నాటికి నోట్ల ఉపసంహరణ ప్రకటన తర్వాత భారీ తగ్గుదల.
  • ₹2000 నోట్లు ఇంకా చట్టబద్ధమైన టెండర్, కానీ వాడకంపై పరిమితులున్నాయి.
  • ప్రజలు బ్యాంకుల్లో, RBI కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవచ్చు.

2000 Rupee Note Update: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2,000 రూపాయల నోట్ల చెలామణిపై బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. చెలామణిలో భారీ తగ్గుదల ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 30, 2025 నాటికి, ఈ నోట్ల మొత్తం విలువ 5,884 కోట్ల రూపాయలకు తగ్గినట్టు తన నివేదికలో వెల్లడించింది. మే 2023లో నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు వాటి విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలు, ఇది ప్రస్తుత పరిస్థితిలో భారీ తగ్గుదలను సూచిస్తుంది.

అయితే, ఈ నోట్లను ఉపసంహరించుకునే సర్క్యులేషన్ ఇప్పటికే జారీ చేశారు. అయినప్పటికీ, 2,000 రూపాయల నోటు ఇప్పటికీ చట్టబద్ధమైన టెండర్ హోదాను కలిగి ఉంది. అంటే మీరు వాటిని రోజువారీ జీవితంలో ఉపయోగించలేరు. కానీ రుణాలను చెల్లించడానికి, ఆర్థిక విషయాల్లో దీనిని ఇప్పటికీ ఉపయోగించవచ్చు.

నోట్ల రద్దు తర్వాత 2000 నోట్లు విడుదలయ్యాయి

నవంబర్ 2016లో, కేంద్ర ప్రభుత్వం 500,  1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత, దేశంలో అవసరాలను తీర్చడానికి RBI 2000 రూపాయల విలువైన నోట్లను ముద్రించింది. అయితే, లక్ష్యం నెరవేరిన తర్వాత, ఇతర విలువ కలిగిన నోట్లు తగినంతగా ముద్రించారు. దీంతో ఆ రెండు వేల రూపాయల నోట్లను కూడా నిలిపివేయాలని RBI నిర్ణయించింది. 2028-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేసింది. 2000 నోట్లలో ఎక్కువ భాగం మార్చి 2017కి ముందు విడుదలయ్యాయి. ఈ నోట్ల చెలామణి కాలపరిమితి కూడా పూర్తవుతోంది.

నోట్లను ఎలా మార్చుకోవాలి?

RBI దేశ ప్రజలకు 2000 రూపాయల నోట్లను మార్చుకునే పూర్తి అవకాశాన్ని ఇచ్చింది. అక్టోబర్ 7, 2023 వరకు మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి 2000 నోట్లను జమ చేయవచ్చు లేదా నోట్లను మార్చుకోవచ్చు అని ప్రకిటంచింది. కానీ ఆ గడవు తేదీ ఎప్పుడో ముగిసిపోయింది. అయినా ఇంకా చాలా మంది వద్ద ఈ నోట్లు ఉన్నాయి. అందుకే అలాంటి వారికి కూడా ఆర్బీఐ అవకాశాన్ని ఇచ్చింది. అక్టోబర్ 9, 2023 నుంచి 19 కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లి 2000 నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది. దీనితో పాటు, మీరు పోస్ట్ ద్వారా RBI కార్పొరేట్ కార్యాలయానికి 2000 నోట్లను పంపవచ్చు, మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చి డబ్బును మార్చుకోవచ్చు.

చాలాసార్లు మనం చిరిగిన, రంగు మారిన నోట్లను చూస్తాము. ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏమిటంటే, రిక్షా పుల్లర్ అయినా లేదా మెట్రో ఉద్యోగి అయినా ఎవరూ అలాంటి నోట్లను అంగీకరించరు. దీనితో పాటు, కొన్నిసార్లు చిరిగిన నోట్లు కూడా ATMల నుంచి బయటకు వస్తాయి, ఇది సమస్యగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు బ్యాంకుకు వెళ్లి ఈ నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. కాబట్టి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని కోసం RBI కొన్ని నియమాలను రూపొందించింది. దీనిని RBI నోట్ మార్పిడి విధానం అంటారు. దీని కింద, ఏ వ్యక్తి అయినా బ్యాంకు లేదా RBI నుంచి చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. 

ఏ నోట్లను మార్పిడి చేస్తారు

మీరు చిరిగిన లేదా రంగు మారిన నోట్‌ అందుకున్నట్టైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు సులభంగా బ్యాంకుకు వెళ్లి దానిని మార్చుకోవచ్చు.  

1. చిరిగిన నోట్లు - నోటులో ఒక భాగం చిరిగిపోయినప్పటికీ దాని గుర్తింపు చెక్కుచెదరకుండా ఉంటే, బ్యాంకు దానిని వెంటనే మార్పిడి చేస్తుంది.

2. దెబ్బతిన్న నోట్లు - నూనె, సుగంధ ద్రవ్యాలు, మరకలు, రసాయనాలు లేదా మరేదైనా రకమైన నష్టం వల్ల నోట్ దెబ్బతిన్నట్లయితే, ఆ నోట్లు కూడా మారుస్తారు.

3. తీవ్రంగా చెడిపోయిన నోట్లు - కొన్ని నోట్లు చాలా పేలవమైన స్థితిలో ఉన్నాయి, కాలిపోయినవి, చాలా పాతవి లేదా పూర్తిగా చిరిగిన నోట్లు వంటివి. మీరు వీటిని ఎటువంటి సమస్య లేకుండా సులభంగా మార్చుకోవచ్చు.

4. తడిసిన నోట్లు - ఒక నోట్ నీటిలో తడవడం అస్పష్టంగా మారితే, మీరు అలాంటి నోట్లను కూడా మార్చుకోవచ్చు.

5. రంగు నోట్లు - కొన్నిసార్లు నోట్లపై రాతలు ఉంటాయి, కొన్నిసార్లు రంగులో ముంచి ఉంటారు. అటువంటి పరిస్థితిలో కూడా, మీరు ఆ నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.

నోట్లను ఎక్కడ మార్చుకోవాలి:

మీరు మీ పాత, చిరిగిన, కాలిపోయిన నోట్లను ఈ క్రింది ప్రదేశాలలో మార్చుకోవచ్చు:

ఏదైనా ప్రభుత్వ బ్యాంకు శాఖ
ఏదైనా ప్రైవేట్ బ్యాంకు శాఖ
ఏదైనా కరెన్సీ చెస్ట్ శాఖలో

RBI యొక్క ఏదైనా ఇష్యూ కార్యాలయంలో
ఏదైనా బ్యాంకు, ప్రైవేట్ లేదా పబ్లిక్ అయినా, RBI నిబంధనల ప్రకారం చిరిగిన, దెబ్బతిన్న నోట్లను అంగీకరించాలి. నోట్లు చాలా పేలవమైన స్థితిలో ఉంటే, మీరు వాటిని RBI జారీ కార్యాలయానికి తీసుకెళ్లాలి, అక్కడ మీరు మార్పిడి చేసిన నోట్లను అందుకుంటారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget