search
×

IT Firm to Retain Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! 3 నెలలకోసారి ప్రమోషన్లు! లిస్టులో మీ కంపెనీ ఉందా?

IT Firm to Retain Employees: అట్రిషన్‌ రేటును తగ్గించుకొనేందుకు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో వంటి కంపెనీలు కొత్త దారులు అనుసరిస్తున్నాయి. వేతనాలను భారీగా పెంచుతున్నాయి.

FOLLOW US: 
Share:

IT Firm to Retain Employees: కరోనా మహమ్మారి తర్వాత డిజిటలైజేషన్‌ వేగంగా పెరిగింది. సంప్రదాయ కంపెనీలు డిజిటల్‌ బాట పట్టడంతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు పెరిగాయి. దాంతో అనుభవంతో పాటు నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్‌ ఎక్కువైంది. ఫలితంగా అట్రిషన్‌ రేట్‌ పెరిగింది. దీనిని అడ్డుకొనేందుకు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో వంటి కంపెనీలు కొత్త దారులు అనుసరిస్తున్నాయి. వేతనాలను భారీగా  పెంచుతున్నాయి. అంతేకాకుండా మిడ్‌ టర్మ్‌ హైకులు, ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు ఇస్తున్నాయి.

ఐటీ కంపెనీ విప్రో 2022, జూన్‌ త్రైమాసికం ఫలితాలను ఈ మధ్యే విడుదల చేసింది. జులై నుంచి ప్రతి మూడు నెలలకు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించింది. వచ్చే నెల నుంచి వేతనాలు భారీగా పెంచుతున్నామని వెల్లడించింది. సామర్థ్యం గల ఉద్యోగులకు రీటెన్షన్‌ బోనస్‌, వేతన సవరణలు చేపడుతున్నామని ఇతర కంపెనీలు చెబుతున్నాయి.

టీసీఎస్‌లో చివరి త్రైమాసికంలో అట్రిషన్‌ రేటు 19.7 శాతంగా ఉంది. గత ఆరు నెలలుగా ఈ కంపెనీ అత్యధిక అట్రిషన్‌ రేటుతో ఇబ్బంది పడుతోంది. 2022, మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇది 17.4 శాతంగా ఉండటం గమనార్హం. తెలివైన ఉద్యోగులను తమవద్దే ఉంచుకొనేందుకు ఫ్లెక్సిబిలిటీ, హైబ్రీడ్‌ మోడల్‌ను అనుసరిస్తున్నామని కంపెనీ తెలిపింది. హెచ్‌సీఎల్‌ కంపెనీ అట్రిషన్‌ రేటు 23.8 శాతంగా ఉంది.

2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో విప్రో అట్రిషన్‌ రేటు అత్యధికంగా 23.3 శాతంగా ఉంది. కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది కాస్త తక్కువే కావడం గమనార్హం. గతేడాది చివరి క్వార్టర్లో అట్రిషన్‌ రేటు 23.8 శాతంగా ఉండటం గమనార్హం. 'మానవ వనరులపై మేం పెడుతున్న పెట్టుబడికి ఫలితాలు వస్తున్నాయి. ఇక నుంచి ఏడాది కాకుండా మేము మూడు నెలల ప్రమోషన్‌ సైకిల్‌ను అనుసరించబోతున్నాం. జులై నుంచే ఇది అమల్లోకి వస్తుంది. 2022 సెప్టెంబర్లో అర్హత ఉన్నవారికి వేతనాలు పెరుగుతాయి' అని విప్రో సీఈవో, ఎండీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు.

Also Read: బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేసిన గౌతమ్‌ అదానీ - ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి ఇండియన్‌

Also Read: 10 పైసలు పెరిగిన రూపాయి! వీకెండ్లో భారీగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ

Published at : 22 Jul 2022 05:30 PM (IST) Tags: TCS Wipro HCL IT Firms Talented Employees

ఇవి కూడా చూడండి

RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్‌ ఎవరు పంపుతున్నారు ?

RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్‌ ఎవరు పంపుతున్నారు ?

Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?

Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?

SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?

SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?

Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!

Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!

Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!

Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!

టాప్ స్టోరీస్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!

IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు

Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు

One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్

One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో  అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్