search
×

Fraud alert: పేమెంట్‌ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్‌!

Fraud alert: మా ఫ్రెండ్‌కు పంపించబోయి మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయి బ్రో! తిరిగి నాకు ట్రాన్స్‌ఫర్‌ చేయరా ప్లీజ్‌! అంటే కాస్త ఆలోచించాల్సిందే!

FOLLOW US: 
Share:

Fraud alert:

అయ్యయ్యో! పొరపాటున మరొకరి బదులు మీకు డబ్బులు పంపించామండీ! మా ఫ్రెండ్‌కు పంపించబోయి మీ మొబైల్ పేమెంట్ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయి బ్రో! తిరిగి నాకు ట్రాన్స్‌ఫర్‌ చేయరా ప్లీజ్‌! అంటే కాస్త ఆలోచించాల్సిందే! ఎందుకంటే టెక్నాలజీ మారేకొద్దీ సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మారుస్తున్నారు! కొత్త కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఈ మధ్యే ముంబయిలో 16 రోజుల్లో 81 మంది కోటి రూపాయల వరకు ఇలాగే నష్టపోయారు.

డబ్బు పంపించి!

బ్యాంకు కేవైసీ, పాన్‌ కార్డు, ఆన్‌లైన్‌ లింకులు పంపించి బ్యాంకు మోసాలు చేయడం చూస్తేనే ఉన్నాం. చాలా మంది కోట్ల రూపాయల డబ్బును ఇలాగే మోసపోయారు. ఇప్పుడు మొబైల్ పేమెంట్ యాప్ ల గేట్‌వేలను ఉపయోగించుకొని డబ్బులు కొట్టేస్తున్నారు. బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సైబర్‌ నేరగాళ్లు ఉద్దేశపూర్వకంగానే మీకు రూ.10 నుంచి 50 వరకు పంపిస్తారు. తర్వాత ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని దయచేసి వెనక్కి పంపించాలని కోరుతారు. దాంతో మాల్‌వేర్‌తో అటాక్‌ చేసి డబ్బు కొట్టేస్తారు.

మాల్‌వేర్‌ ప్లస్‌ మానవ శ్రమ

మొబైల్ పేమెంట్ అప్లికేషన్ల యూజర్లనే మోసగాళ్లు టార్గెట్‌ చేసుకుంటున్నారని దిల్లీ సైబర్‌ క్రైమ్‌ ఎక్స్‌పర్ట్‌ పవన్ దుగ్గల్‌ అంటున్నారు. 'ఇదో మాల్‌వేర్‌ ప్లస్‌ హ్యూమన్‌ ఇంజినీరింగ్‌ స్కామ్‌. కొందరు కావాలనే ఇతరుల ఖాతాలకు డబ్బులు పంపిస్తారు. ఆ తర్వాత ఫోన్‌ చేసి పొరపాటున పంపించామని, తమ ఫోన్‌ నంబర్‌కు డబ్బులు పంపించాలని రిక్వెస్ట్‌ చేస్తారు. ఒకవేళ మీరు డబ్బులు పంపిస్తే మీ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్టే' అని ఆయన తెలిపారు.

ఈ జాగ్రత్తలు కంపల్సరీ!

'ఈ మోసంలో మాల్‌వేర్ (Malware), మనుషుల శ్రమ కలిసి ఉంది. ఇలాంటప్పుడు మొబైల్ పేమెంట్ అప్లికేషన్లను యాంటీ మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్లు కాపాడలేవు. ఒకవేళ పొరపాటున డబ్బు వచ్చిందని ఎవరైనా కాల్‌ చేస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి. డబ్బు డిపాజిట్‌ అయిందో లేదో కనుక్కోండి. ఏదైనా ప్రమాదం ఉందో తెలుసుకోంది' అని దుగ్గల్‌ పేర్కొన్నారు.

మొబైల్ పేమెంట్ అప్లికేషన్ల నుంచి లావాదేవీల చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని, రీపేమెంట్‌ చేసిన లావాదేవీ స్క్రీన్‌ షాట్లు మాత్రం షేర్‌ చేయొద్దన్నారు. అలా చేస్తే మోసగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఇస్తున్నట్టేనని వివరించారు. తెలియని వాళ్లకు ఇలాంటివి షేర్‌ చేయొద్దన్నారు. ఒకవేళ డబ్బు ఇవ్వాల్సి వస్తే మీ సమీపంలోని పోలిస్‌ స్టేషన్‌కు రావాల్సిందిగా సూచిస్తున్నారు.

Also Read: ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఐపీవో ప్రారంభం, బిడ్‌ వేసే ముందు కచ్చితంగా తెలియాల్సిన విషయాలివి!

Published at : 20 Mar 2023 01:38 PM (IST) Tags: Online scam Phone pe Google pay FRAUD ALERT Bank scam

సంబంధిత కథనాలు

Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్‌!

Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్‌!

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన