By: ABP Desam | Updated at : 07 Apr 2022 01:27 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గుడ్న్యూస్! ఈ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు 25% సాలరీ హైక్ - మిగతావాళ్లకి 9% పెంపు
India Inc salary Hike 2022: ఉద్యోగులకు గుడ్న్యూస్! ప్రైవేటు రంగంలోని వారికి ఈ ఆర్థిక ఏడాదిలో వేతనాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కనీసం 8-12 శాతం వరకు పెరుగుతాయని తాజా నివేదికలో తెలిసింది. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు వాతావరణం అనువుగా ఉండటంతో కంపెనీలు సగటున 9 శాతం హైక్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందుకు దోహదం చేస్తోంది. కరోనా ముందు 2019లోని 7 శాతం సగటు పెంపుతో పోలిస్తే 2022లో 9 శాతంగా ఉందని మైకేల్ పేజ్ సాలరీ రిపోర్టు 2022 తెలిపింది.
యూనికార్న్, కొత్త తరహా స్టార్టప్పులు, పెద్ద సంస్థలు 12 శాతం వరకు వేతనాలు పెంచుతాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ, కన్స్స్ట్రక్షన్ వంటి గ్రోత్ కంపెనీలు దీనిని కొనసాగిస్తాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ-కామర్స్, ఇతర సంస్థలు డిజిటలైజ్ అవుతుండటంతో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ లెవల్ ఉద్యోగులు తమ వేతనాలను భారీ పెంచుకొనేందుకు డిమాండ్ చేయొచ్చని నివేదిక తెలిపింది. వారి జీతాలు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ పెరుగుతాయని పేర్కొంది. డేటా సైంటిస్టులు, వెబ్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది. మంచి యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందిన వారికీ డిమాండ్ పెరుగుతోంది.
ఒకే తరహా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఉన్న ఉన్నతోద్యోగులతో పోలిస్తే టెక్నాలజిస్టులు సగటు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల్లో టాప్ ఫెర్ఫామర్లకు కంపెనీలు స్వల్పకాల, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అప్రైజల్స్, ప్రమోషన్లు, వేరియబుల్ పేమెంట్లు, స్టాక్ ఇన్సెంటివులు, రీటెన్షన్ బోనసులు, మిడ్ టర్మ్ ఇంక్రిమెంట్ల రూపంలో వేర్వేరు ఆఫర్లు ఇవ్వనున్నాయి.
మున్ముందు కరోనా వైరస్తో ఎక్కువ ఇబ్బందులు ఉండకపోవచ్చని కంపెనీలు, యజమానాలు భావిస్తున్నారు. మార్కెట్పై దాని ప్రభావం ఎక్కువగా ఉండదని అంచనా వేస్తున్నారు. అందుకే బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇవ్వనున్నాయి. వీరికి కనీసం 20-25 శాతం సగటు ఇంక్రిమెంట్లు ఉంటాయని నివేదిక తెలిపింది. 'కరోనా మహమ్మారిని మనం దాటేశామన్న సానుకూల దృక్పథం అందరిలోనూ ఉంది. ఉద్యోగ నియామకాల మార్కెట్ సైతం బాగా పుంజుకుంది. బెస్ట్ టాలెంట్ను ఒడిసిపట్టేందుకు కంపెనీలు తెలివైన వారికి ఆకర్షించేందుకు ఆఫర్లు ఇస్తున్నారు' అని నివేదిక వెల్లడించింది.
'అట్రిషన్ రేటు పెరుగుతుండటంతో టాలెంట్ కొరత ఏర్పడుతోంది. మంచి నైపుణ్యాలు ఉన్న వారి వేతనాలు పెంచేందుకు ఇది దోహదం చేస్తోంది. వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ప్రతిభ ఉన్నవారినే కాకుండా నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ బాగున్నవారిని కంపెనీలు తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వాతావరణం, ఉద్యోగి సంక్షేమం కోరే కంపెనీలకే ఉద్యోగులు ఓటేసే అవకాశాలు ఎక్కువ' అని మైకేల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల అన్నారు.
SBI ATM Card: ఎస్బీఐ ఏటీఎం కార్డ్ కోసం అప్లై చేయడం ఇప్పుడు ఈజీ, బ్యాంక్ ఆ పనిని సింపుల్గా మార్చింది
ITR 2024: ఐటీఆర్ను ఇప్పుడు సబ్మిట్ చేయాలా, ఆగాలా? - ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు?
Post Office Schemes: పోస్టాఫీస్లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్ తెలుసుకోండి
Latest Gold-Silver Prices Today: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices Today: తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?