By: ABP Desam | Updated at : 07 Apr 2022 01:27 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గుడ్న్యూస్! ఈ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు 25% సాలరీ హైక్ - మిగతావాళ్లకి 9% పెంపు
India Inc salary Hike 2022: ఉద్యోగులకు గుడ్న్యూస్! ప్రైవేటు రంగంలోని వారికి ఈ ఆర్థిక ఏడాదిలో వేతనాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కనీసం 8-12 శాతం వరకు పెరుగుతాయని తాజా నివేదికలో తెలిసింది. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు వాతావరణం అనువుగా ఉండటంతో కంపెనీలు సగటున 9 శాతం హైక్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందుకు దోహదం చేస్తోంది. కరోనా ముందు 2019లోని 7 శాతం సగటు పెంపుతో పోలిస్తే 2022లో 9 శాతంగా ఉందని మైకేల్ పేజ్ సాలరీ రిపోర్టు 2022 తెలిపింది.
యూనికార్న్, కొత్త తరహా స్టార్టప్పులు, పెద్ద సంస్థలు 12 శాతం వరకు వేతనాలు పెంచుతాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ, కన్స్స్ట్రక్షన్ వంటి గ్రోత్ కంపెనీలు దీనిని కొనసాగిస్తాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ-కామర్స్, ఇతర సంస్థలు డిజిటలైజ్ అవుతుండటంతో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ లెవల్ ఉద్యోగులు తమ వేతనాలను భారీ పెంచుకొనేందుకు డిమాండ్ చేయొచ్చని నివేదిక తెలిపింది. వారి జీతాలు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ పెరుగుతాయని పేర్కొంది. డేటా సైంటిస్టులు, వెబ్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది. మంచి యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందిన వారికీ డిమాండ్ పెరుగుతోంది.
ఒకే తరహా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఉన్న ఉన్నతోద్యోగులతో పోలిస్తే టెక్నాలజిస్టులు సగటు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల్లో టాప్ ఫెర్ఫామర్లకు కంపెనీలు స్వల్పకాల, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అప్రైజల్స్, ప్రమోషన్లు, వేరియబుల్ పేమెంట్లు, స్టాక్ ఇన్సెంటివులు, రీటెన్షన్ బోనసులు, మిడ్ టర్మ్ ఇంక్రిమెంట్ల రూపంలో వేర్వేరు ఆఫర్లు ఇవ్వనున్నాయి.
మున్ముందు కరోనా వైరస్తో ఎక్కువ ఇబ్బందులు ఉండకపోవచ్చని కంపెనీలు, యజమానాలు భావిస్తున్నారు. మార్కెట్పై దాని ప్రభావం ఎక్కువగా ఉండదని అంచనా వేస్తున్నారు. అందుకే బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇవ్వనున్నాయి. వీరికి కనీసం 20-25 శాతం సగటు ఇంక్రిమెంట్లు ఉంటాయని నివేదిక తెలిపింది. 'కరోనా మహమ్మారిని మనం దాటేశామన్న సానుకూల దృక్పథం అందరిలోనూ ఉంది. ఉద్యోగ నియామకాల మార్కెట్ సైతం బాగా పుంజుకుంది. బెస్ట్ టాలెంట్ను ఒడిసిపట్టేందుకు కంపెనీలు తెలివైన వారికి ఆకర్షించేందుకు ఆఫర్లు ఇస్తున్నారు' అని నివేదిక వెల్లడించింది.
'అట్రిషన్ రేటు పెరుగుతుండటంతో టాలెంట్ కొరత ఏర్పడుతోంది. మంచి నైపుణ్యాలు ఉన్న వారి వేతనాలు పెంచేందుకు ఇది దోహదం చేస్తోంది. వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ప్రతిభ ఉన్నవారినే కాకుండా నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ బాగున్నవారిని కంపెనీలు తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వాతావరణం, ఉద్యోగి సంక్షేమం కోరే కంపెనీలకే ఉద్యోగులు ఓటేసే అవకాశాలు ఎక్కువ' అని మైకేల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల అన్నారు.
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం