By: ABP Desam | Updated at : 10 Oct 2022 09:13 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
2000 Rupee Currency Notes: మీ వద్ద రూ.2,000 నోట్లు ఉన్నాయి. కాబట్టి ఆ నోటు నకిలీదా నిజమైనదా అని కచ్చితంగా తనిఖీ చేయండి. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో 60 శాతం రూ .2,000 కరెన్సీ నోట్లే. 2016లో 500, 1000 రూపాయల పాత నోట్లను నిషేధించిన తరువాత 2,000 రూపాయలు, 500 రూపాయల కొత్త నోట్లు జారీ చేశారని మీకు తెలిసిందే. నకిలీ కరెన్సీని నిర్మూలించడమే పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెప్పింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం, 2021లో మొత్తం రూ.20.39 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ .12.18 కోట్లకు సమానమైన నకిలీ నోట్లు రూ.2000. అంటే స్వాధీనం చేసుకున్న మొత్తం నోట్లలో 60 శాతం రూ.2,000 కరెన్సీయే. 2016తో పోలిస్తే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం పెరిగిందని ఎన్సీఆర్బీ తెలిపింది. 2016లో 15.92 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2017లో రూ.28.10 కోట్లు, 2019లో రూ.17.95 కోట్లు, 2020లో రూ.92.17 కోట్లు, 2021లో రూ.20.39 కోట్ల విలువైన నకిలీ నోట్లు గుర్తించారు.
దేశంలో 2,000 రూపాయల నోటు చలామణిలో భారీ తగ్గుదల కనిపించింది. 2020-21లో మొత్తం కరెన్సీ చెలామణిలో రూ.2,000 నోట్ల వాటా 17.3 శాతంగా ఉందని, అది ఇప్పుడు 13.8 శాతానికి పడిపోయిందని 2021-22 వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.
2019-20లో రూ.5,47,952 విలువ చేసే 2,73.98 కోట్ల 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని, ఇది మొత్తం నోట్ల చలామణిలో 22.6 శాతంగా ఉందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020-21లో రూ.245.10 కోట్ల నుంచి రూ.4,90,195 కోట్లకు తగ్గింది. కానీ 2021-22లో మొత్తం కరెన్సీ చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య రూ.4,28,394 కోట్ల విలువైన 214.20 కోట్లకు తగ్గింది. ఇప్పుడు చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య 2020-21లో 2 శాతం, 2019-20లో 2.4 శాతం నుంచి 2021-22లో 1.6 శాతానికి తగ్గింది.
మార్చి 31, 2018 నాటికి, 336.3 కోట్ల రూ .2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి, ఇది మొత్తం నోట్ల చలామణిలో 3.27 శాతం. విలువ పరంగా 37.26 శాతం. మార్చి 31, 2022 నాటికి 214.20 కోట్ల రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది మొత్తం నోట్లలో 1.6శాతం ఉంటే విలువ పరంగా 13.8 శాతానికి తగ్గింది.
వాస్తవానికి 2018-19 నుంచి రూ .2,000 నోట్ల ముద్రణ కోసం కొత్త ఉత్తర్వులు ఇవ్వలేదని 2021 డిసెంబర్లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. రూ.2,000 నోట్ల చెలామణి తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ, 2018-19 నుంచి నోట్లను ముద్రించడానికి కొత్తగా ఆర్డర్లు ఇవ్వలేదని, అందువల్ల 2,000 నోట్ల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల వల్ల జరుగుతున్న నష్టం వల్ల కూడా నోట్లు చెలామణిలో లేవు. దీని కారణంగా వాటి సంఖ్య తగ్గింది.
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Unified Pension Scheme: మరో 10 రోజుల్లో 'ఏకీకృత పింఛను పథకం' - ఇలా దరఖాస్తు చేసుకోండి
Toll Deducted Twice: టోల్ గేట్ దగ్గర రెండుసార్లు డబ్బు కట్ అయ్యిందా? - ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది
Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH Vs RR Result Update: సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. ఈ సీజన్లో సొంతగడ్డపై గెలిచిన తొలి జట్టు.. పోరాడి ఓడిన రాజస్థాన్.. జురెల్, శాంసన్ పోరాటం వృథా
Kishan Reddy: డీలిమిటేషన్పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్రెడ్డి
Ghajini 2: 'గజిని 2' కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న డైరెక్టర్ మురుగదాస్! - సీక్వెల్ క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..