search
×

Financial Fraud : డిజిటల్ లావాదేవీల్లో మోసపోతున్న 42 శాతం భారతీయులు ! విస్తుగొలిపే వాస్తవాలు

గత మూడేళ్లుగా దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అయితే అదే సమయంలో మోసాలు కూడా పెరిగాయి. ప్రతి వంద మందిలో సగటున 42 మంది మోసపోతున్నారు. దీనికి అవగాహన లేకపోవడమే కారణం.

FOLLOW US: 
Share:

 

Financial Fraud : డిజిటల్ లావాదేవీల కారణంగా ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయని గత మూడేళ్లలో దాదాపు 42 శాతం మంది భారతీయులు బాధితులుగా మారినట్లుగా కొత్త నివేదిక  వెల్లడించింది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ అందించిన డేటా ప్రకారం, గత మూడేళ్లలో, బ్యాంకింగ్ మోసాల కారణంగా డబ్బును కోల్పోయిన వారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే తమ నిధులను తిరిగి పొందగలిగారు . 74 శాతం మంది అసలు తమ ఫిర్యాదులపై ఎలాంటి సమాచారం కూడా పొందలేకపోయారు.  

డెబిట్ , క్రెడిట్ కార్డ్ పిన్ వివరాలను  బహిర్గత పర్చడం వల్ల సమస్య

29 శాతం మంది పౌరులు తమ డెబిట్ కార్డ్ పిన్ వివరాలను సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పంచుకున్నారని సర్వేలోతేలింది. అలాగే 4 శాతం మంది తమ ఇళ్లు, ఆఫీసుల్లో పని చేసే వారికి కూడాచెప్పారు.  33 శాతం మంది పౌరులు తమ బ్యాంక్ ఖాతా, డెబిట్ , డిట్ కార్డ్  పాస్‌వర్డ్‌లు, ఆధార్ , పాన్ నంబర్‌లను ఇ మెయిల్స్‌లో సేవ్ చేసుకున్నారు. 11 శాతం మంది పౌరులు ఈ వివరాలను తమ మొబైల్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నారని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయింది.  

పలు రకాల మోసాలతో నష్టపోతున్న భారతీయులు

బ్యాంక్ ఖాతా మోసం, ఫ్లై-బై-నైట్ ఈ కామర్స్ ఆపరేటర్ల మోసం, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ మోసాలు సమస్యకు ప్రధాన కారణాలని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయింది.  ఫోన్ కాంటాక్ట్‌,  ఈ మెయిల్స్‌లో న్నితమైన ఆర్థిక వివరాలను సేవ్ చేసుకోవడం వల్ల   సైబర్ దాడులు గురవడానికి అవకాశం ఏర్పడింది.  బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు ,  ATM, బ్యాంక్ ఖాతా, ఈ మెయిల్ మొదలైన వాటి వివరాలను స్మార్ట్‌ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో  సేవ్ చేయడం  సురక్షితం కాదని లోకల్ సర్కిల్స్ స్పష్టం చేసింది. 

పిన్ నెంబర్లు కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకుంటే మోసాలకు ఎక్కువ అవకాశం 

ఈ రోజుల్లో ఆన్‌లైన్ యాప్‌లు ఒకరి కాంటాక్ట్‌లను , మెసెజ్‌లను సందేశాలను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతున్నాయి. యాక్సెస్ ఇస్తే వారు మన కాంటాక్ట్‌లు..మెసెజ్‌లు చూడగలరు. అందుకే ఆన్ లైన్ మోసాల నుంచి బయటపడటానికి   సెల్ ఫోన్ , ల్యాప్ ట్యాప్ వంటి గాడ్జెట్స్‌లో ఆల్ఫా-న్యూమరిక్ పాస్‌వర్డ్ లాక్‌ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లు  కష్టతరమైన రీతిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.  

Published at : 04 Aug 2022 07:50 PM (IST) Tags: Bank Fraud digital payments Localcircles financial fraud

ఇవి కూడా చూడండి

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం

Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం

Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు

Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్

India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్