search
×

Stock Market Closing: దడ పుట్టించిన ఐటీ షేర్లు! సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 66 డౌన్‌!

Stock Market Closing 13 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 66 పాయింట్ల నష్టంతో 18,003వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 13 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడినా డొమస్టిక్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. ఐటీ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 66 పాయింట్ల నష్టంతో 18,003 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 224 పాయింట్ల నష్టంతో 60,346 వద్ద ముగిశాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 60,571 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,417 వద్ద నష్టాల్లో మొదలైంది. 59,417 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,649 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 224 పాయింట్ల నష్టంతో 60,346 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 18,070 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,771 వద్ద ఓపెనైంది. 17,771 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,091 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 66 పాయింట్ల నష్టంతో 18,003 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం భారీ లాభాల్లో క్లోజైంది. ఉదయం 40,308 వద్ద మొదలైంది. 40,288 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,626 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 532 పాయింట్ల లాభంతో 41,405 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, మెటల్‌ సూచీలు 1.5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఫైనాన్స్‌, మీడియా స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

Published at : 14 Sep 2022 03:48 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

టాప్ స్టోరీస్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు

CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు