search
×

Stock Market Closing: అమేజింగ్‌ రికవరీ! పీఎస్‌యూ అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దూకుడు

Stock Market Closing 22 November 2022: ఒడుదొడులకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 22 November 2022: ఒడుదొడులకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 84 పాయింట్ల లాభంతో 18,244 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 274 పాయింట్ల లాభంతో 61,418 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలపడి 81.67 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 61,144 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,126 వద్ద మొదలైంది. 61,073 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,466 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 274 పాయింట్ల లాభంతో 61,418 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 18,159 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,179 వద్ద ఓపెనైంది. 18,137 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,261 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.  మొత్తంగా 84 పాయింట్ల లాభంతో 18,244 వద్ద స్థిరపడింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరు లాభపడింది. ఉదయం 42,467 వద్ద మొదలైంది. 42,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,508 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 110 పాయింట్ల లాభంతో 42,457 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్ గ్రిడ్‌ కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

Published at : 22 Nov 2022 03:53 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే

Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు

Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు

Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు

Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్