search
×

Stock Market Crash: ఒక్క సెషన్లో రూ.6 లక్షల కోట్లు హాం ఫట్‌! సెన్సెక్స్‌ 1200, నిఫ్టీ 350 డౌన్‌

Stock Market Crash: భారత స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం రక్తకన్నీరు ప్రవహించింది. బెంచ్‌మార్క్‌ సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి.

FOLLOW US: 
Share:

 Stock Market Closing 16 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం రక్తకన్నీరు ప్రవహించింది. బెంచ్‌మార్క్‌ సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, డాలర్‌ విలువ పెరుగుదల, ఐటీ షేర్ల విక్రయాలు, భారత వృద్ధిరేటులో స్వల్ప కోత, ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరల పెరుగుదల మదుపర్ల సెంటిమెంటును గాయపరిచింది. వారు ఈ ఒక్కరోజే రూ.6 లక్షల కోట్ల సంపద నష్టపోయారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 346 పాయింట్ల నష్టంతో 17,530 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1093 పాయింట్ల నష్టంతో 58,840 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 59,934 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,585 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 58,687 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1093 పాయింట్ల నష్టంతో 58,840 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1250 పాయింట్ల మేర నష్టపోయిన సూచీ ఆఖర్లో కాస్త తేరుకుంది.

NSE Nifty

గురువారం 17,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,698 వద్ద ఓపెనైంది. 17,497 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 346 పాయింట్ల నష్టంతో 17,530 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ఉదయం 40,977 వద్ద మొదలైంది. 40,502 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,162 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 432 పాయింట్ల నష్టంతో 40,776 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా షేర్లు మాత్రమే లాభపడ్డాయి. యూపీఎల్‌, టాటా కన్జూమర్స్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఇన్ఫీ భారీగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, ఆటో, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఏకంగా 2-4 శాతం మేర పతనమయ్యాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

Published at : 16 Sep 2022 03:35 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Crash share market crash Stock Market news

ఇవి కూడా చూడండి

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

టాప్ స్టోరీస్

Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.

Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.

Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 

Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 

Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 

Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ