కళ్ల ముందు ఏదైనా అనుకోని ఆపద జరిగితే కొందరు కచ్చితంగా స్పందిస్తారు. మరికొందరు చూసి చూడనట్లుగా వెళ్లిపోతారు. కానీ కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడిని రైల్వే ఇన్‌స్పెక్టర్ రామారావు చాకచక్యంగా వ్యవహరించి కాపాడటం వైరల్‌గా మారింది. రైలు కింద పడిపోతున్న ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.


చిత్తూరు జిల్లా తిరుపతి వెళ్లే రేణిగుంట ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కాకినాడ రైల్వే స్టేషన్ చేరుకుంది. టైమ్ కావడంతో ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్ ఫామ్ నుంచి నెమ్మదిగా కదులుతోంది. అంతలో రమేష్ అనే ప్రయాణికుడు రైలును ఎలాగైనా అందుకోవాలని ప్రయత్నించారు. దాంతో అనుకోకుండా పట్టుతప్పిపోయిన ప్రయాణికుడు రైలు పట్టాలు, ప్లాట్ ఫాంకు మధ్యలో చిక్కుకుపోయాడు. రైలు అతడ్ని ఈడ్చుకెళ్తుండగా.. గస్తీలో ఉన్న టౌన్ రైల్వేస్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామారావు సరిగ్గా అదే సమయంలో రెండో నెంబర్ ప్లామ్ ఫాంపై ఉన్నారు. ఆయనతో పాటు కానిస్టేబుల్ జగదీశ్ పరుగున వెళ్లి ప్రయాణికుడ్ని రైలు కింద పడిపోకుండా పట్టుకున్నారు.







అదే సమయంలో రామారావు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఓ వైపు రైలు కింద పడిపోతున్న వ్యక్తికి రక్షిస్తూనే మరోవైపు చైన్ లాగి రైలును ఆపాలంటూ గట్టిగా అరిచారు. ఇది విన్న రైల్లోని ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగిపోగానే, ప్రయాణికుడు రమేష్‌ను సురక్షితంగా పట్టాల నుంచి పైకి లాగారు. కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి మరి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులపై తోటి ప్రయాణికులు, నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపింంచారు.


Also Read: Nedurumalli Fire On Anam: నేదురుమల్లికి సీఎం జగన్ సపోర్ట్ ఉందా ? మాజీ మంత్రి ఆనంపై కౌంటర్లకు కారణం అదేనా !


Also Read: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి బాధ్యతల స్వీకరణ, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియామకం