Breaking News: ప్యాలెస్ నిధులు ప్రజల ఖర్చు పెట్టాల్సింది: పవన్

Latest Telugu breaking News: ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. దీంతో మరిన్ని ఏపీ, తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Sheershika Last Updated: 01 Jul 2024 12:34 PM
పంచాయతీ శాఖ నిధులు ఊడ్చేశారు- జీతం తీసుకోకూడదనుకున్నాను: పవన్  

పిఠాపురంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీతం తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిందన్నారు. తన ఛాంబర్‌లో మార్పులు అడిగితే వద్దని చెప్పానని వెల్లడించారు. ఫర్నీచర్ కూడా తానే తెచ్చుకుంటానని జీతం కూడా ఇస్తే వద్దని చెప్పినట్టు పేర్కొన్నారు. 

T20 world Cup 2024: తుపానులో చిక్కుకున్న టీమిండియా- రోహిత్ సేన రాక మరింత ఆలస్యం

Team India: టీ20 ప్రపంచకప్‌ గెలుపు ఆనందంలో ఎప్పుడెప్పుడు భారత్ వెళ్దామని చూస్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. విండీస్‌లో వచ్చిన తుపాను కారణంగా వారి రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తుపాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. రోహిత్ సేన అనుమతి వచ్చే వరకు విండీస్‌లోనే ఉండాల్సి ఉంటుంది. 

Pawan Kalyan: రుషికొండ ప్యాలెస్ నిధులు ప్రజల ఖర్చు పెట్టాల్సింది: పవన్

Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఎటు వెళ్లాయో కూడా తెలియదని అన్నారు. కేవలం రుషి కొండ ప్యాలెస్‌ కోసమే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అవే నిధులు పల్లెల్లో వినియోగించుంటే మంచి జరిగేదన్నారు. 

గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి

మరికాసేపట్లో రాజ్ భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. గవర్నర్‌తో భేటీ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చ జరగనుంది. వాటిని ఆర్డినెన్సు రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా తొలిసారి పిఠాపురం వస్తున్న పవన్ కల్యాణ్‌

2024ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురం రానున్నారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు పిఠాపురం ప్రజలు పార్టీ శ్రేణులు పవన్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఈ ఉదయం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పిఠాపురం నియోజక వర్గానికి బయలుదేరారు




Chandra Babu : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ సీఎం చంద్రబాబు అందించారు. ఉండవల్లి నివాసం 5.45కి బయల్దేరిన చంద్రబాబు పెనుమాక గ్రామానికి చేరుకొని అక్కడ 06.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్టీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందివ్వడంతో పంపిణీ ప్రారంభమైంది. 

Background

మీ భద్రత మా బాధ్యత అంటున్న ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి సంతకం చేసిన మరో పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమన పండగ మొదలైందని చెబుతూ ఎన్టీఆర్‌ భోరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు 65.31 లక్షల మందికి పింఛన్లు అందివ్వనున్నారు. 


ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందివ్వడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. సూర్యుడు ఉదయించక ముందే పింఛన్లు పంపిణీ చేయాలన్ని ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. డబ్బులను కూడా రెండు రోజుల క్రితమే డ్రా చేసి ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయనున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పింఛన్ల పెంపుతోపాటు మూడు నెలల బకాయిలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ విర్గాలకు పింఛన్లు పెంచుతామని ఇచ్చిన మాట ప్రకారం ఆ ఫైల్‌పై మూడో సంతకం చేశారు.


28 వర్గాలకు చెందిన 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు రెండు రోజుల్లో పింఛన్లు అందజేయనున్నారు. 4408 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. పెరిగిన పింఛన్లతో ప్రభుత్వంపై ప్రతి నెల 819 కోట్ల రూపాయల భారం పడనుంది. 


4వేల రూపాయల పింఛన్ అందుకోనుంది వీళ్లే
 వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులు 


ఆరు వేలు పింఛన్ అందుకునేది వీళ్లే -దివ్యాంగులు 


15వేల రూపాయల పింఛన్ అందుకోనుంది వీళ్లే 
తీవ్రమైన అనారోగ్యంతో వీల్‌చైర్‌కు లేదా మంచానికే పరిమితమైన వారు. 


10వేల రూపాయల పింఛన్ అందుకోనుంది
కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కాలేయం వ్యాధిగ్రస్తులు, తలసేమియా బాధితులు
కష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు ఆరు వేలకు పెంచారు. 


ఈసారి పింఛన్ ఎంత వస్తుంది...
ఈసారి అందరికీ పింఛన్లు భారీగా వస్తాయి. పింఛన్ల పెంపు  ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ముందుగానే ప్రకటించిన వేళ ఆ దిశగానే పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు చూసుకుంటే... జులై పింఛన్లు నాలుగు వేలు, ఏప్రిల్, మే, జూన్ బకాయిలు మూడు వేలు. మొత్తంగా వాళ్లు ఏడు వేలు అందుకోనున్నారు. అలానే మిగతా లబ్ధిదారులి కూడా పెంచే పింఛన్‌తోపాటు మూడు నెలల బకాయిలు కూడా రానున్నాయి. 


లబ్ధిదారులకు పింఛన్ అందివ్వనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందిస్తారు. దీంతో పింఛన్ పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరిన చంద్రాబబు ఆరు గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకొని అక్కడ 06.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఎస్టీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత 07.15కు పెనుమాకలోని మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలతో ముచ్చటిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరతారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.