Green Channel: కేవలం 15 నిమిషాల్లో ఎల్బీనగర్ నుంచి బేగంపేటకు ఊపిరితిత్తులు
ABP Desam
Updated at:
28 Sep 2021 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఊపిరితిత్తుల ఆపరేషన్ కోసం అవయవాలను ఓ చోటి నుంచి మరో చోటికి తరలించేందుకు వైద్యులు, పోలీసులు సమన్వయంతో చేసిన కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను అంబులెన్సులో కేవలం పదిహేను నిమిషాల్లో తరలించగలిగారు వైద్యులు. ఇందుకోసం రాచకొండ పోలీసులు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఫలితంగా 17కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ 15 నిమిషాల్లో చేరుకోగలిగింది. పోలీసుల కృషిని కిమ్స్, కామినేని వైద్యులు అభినందించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. ట్రాఫిక్ పోలీసులను ప్రశంసించారు.