Warangal: మిషన్ కాకతీయ తవ్వకాల్లో 1000 ఏళ్ల క్రితం నాటి విగ్రహం, చారిత్రాత్మక ఆనవాళ్లు
ABP Desam
Updated at:
20 Oct 2021 08:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాకతీయ రాజులు పరిపాలించిన ఓరుగల్లు ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక ఆనవాలు వెలుగులోకి వచ్చాయి. అనేక పురాతన గుడులు, విగ్రహాలు, శాసనాలను పరిశోధకులు గుర్తించారు. కాకతీయుల చరిత్రతో పాటు వారికంటే ముందు పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల నాటి ఆనవాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆదిశేషుని విగ్రహాన్ని స్థానిక చారిత్రక పరిశోధకలు రత్నాకర్ రెడ్డి గుర్తించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మరిన్ని పరిశోధనలు జరపాలని కోరుతున్నారు.