మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రమాదం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఓ బైక్ తీసుకుని ఆయన ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను పరామర్శించే ప్రయత్నం చేశారు. ఈలోగా అనుకోకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడుపుతున్న బైక్ కి ప్రమాదం జరిగింది. బండి స్కిడ్ అవటంతో పొంగులేటి కిందపడిపోగా ఆయన కాలికి చేతులకు గాయాలయ్యాయి. వైద్యులు పొంగులేటికి ప్రాథమిక చికిత్సను అందించారు. విశ్రాంతి తీసుకునేది లేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మధ్యాహ్నానికి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్షాల కారణంగా రహదారులు, రైల్వే పట్టాలు కూడా కొట్టుకుపోయాయి. ఎన్నో పట్టణాలు, గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ ఇంకా చాలా పల్లెల్లు నీటిలో బతుకు పోరు సాగిస్తున్నాయి.