IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
ABP Desam
Updated at:
29 Nov 2021 07:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 4/1 ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ టామ్ లాథమ్ (52: 146 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర (18 నాటౌట్: 91 బంతుల్లో, రెండు ఫోర్లు), 11వ నంబర్ ఆటగాడు అజాజ్ పటేల్ (2 నాటౌట్: 23 బంతుల్లో) తొమ్మిది ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకుని.. మ్యాచ్ డ్రాగా ముగించారు.