Train Accident in West Bengal | Kanchanjungha Express | పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం | ABP

Continues below advertisement

Train Accident in West Bengal | Kanchanjungha Express | పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కాంచన జంగ ఎక్స్ ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు గాయపడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డార్జిలింగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసోంలోని సిల్చార్ నుంచి వస్తున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని రంగపాని స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్‌ ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడం వల్ల బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన రెండు కోచ్‌లు అదుపు తప్పాయి. ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రమాద ధాటికి బోగీలు చెల్లాచెదురయ్యాయి. అయితే...ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram