Whistling Village : ప్రధాని మోదీకి ఈలతో కృతజ్ఞతలు తెలిపిన మేఘాలయ గ్రామం..ఏంటా కథ..?

Continues below advertisement

ఐక్యరాజ్యసమితి అత్యుత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో చోటు దక్కించుకునేలా తమ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసినందుకు ఈలతో ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు మేఘాలయలోని ఖోంగ్ తోంగ్ గ్రామస్తులు. ఈలతో ట్యూన్ లు చేసుకుంటూ మాట్లాడుకునే ఖోంగ్ తోంగ్ గ్రామస్తులకు మాట్లాడటం, రాయటం తెలియదు. అలాంటి విభిన్నమైన, ప్రత్యేకమైన గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు మోదీ కోసం ఓ ట్యూన్ చేసి పంపారు. దాన్ని మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీకి, పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సీఎం. దేశంలోనే ఏకైక విజిలింగ్ గ్రామంగా ఖోంగ్ తోంగ్ ను నిలిపినందుకు అక్కడి ప్రజలు సైతం సంతోషంగా ఉన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram