Doctors Negligence : మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి వేదన
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రసవ వేదనకు గురి అయ్యింది.కోవిడ్ సాకుతో డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించడంతో హాస్పటల్ ఆవరణలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.బల్మూర్ మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మ మూడో కాన్పు కోసం తన అక్క అలివేలతో కలసి అచ్చంపేట సివిల్ ఆస్పత్రికి వచ్చింది.ముందు జాగ్రత్తగా వైద్యులు ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ డెలివరీ చేయడం కుదరదని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేసి ఏమీ పట్టనట్టు వున్నారు. కనీసం అంబులెన్సు కూడా ఏర్పాటు చేయకపోవడం గంటకు పైగా అక్కడే వుండటంతో లాలమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనా వైద్యులెవరూ స్పందించలేదు.దీంతో చివరికి ఆస్పత్రి ఆవరణలోనే ఆమె ఆడశిశువుకు జన్మినిచ్చింది.