రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్

Continues below advertisement

హరియాణా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జిలేబీలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో బీజేపీ అదే పనిగా జిలేబీల గురించే పోస్ట్‌లు పెడుతోంది. హరియాణా ఎన్నికల ప్రచారంలో ఓ చోట జిలేబీల బాక్స్ పట్టుకుని స్పీచ్ ఇచ్చారు రాహుల్. రిజల్ట్స్ వచ్చిన తరవాత కాంగ్రెస్‌ని...ముఖ్యంగా రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తోంది బీజేపీ. ఇప్పుడు రాహుల్‌ గాంధీకి మరో స్వీట్ షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని రాహుల్ ఆఫీస్‌కి కిలో జిలీబేలు పంపింది. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ స్వీట్‌లు ఆర్డర్‌ పెట్టామని ఓ పోస్ట్ కూడా పెట్టింది. హరియాణా బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. బీజేపీ కార్యకర్తల తరపున రాహుల్‌కి స్వీట్‌లు పంపుతున్నామని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఆర్డర్‌కి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ని కూడా షేర్ చేసింది. కిలో జిలేబీలకు బిల్‌ 609  రూపాయలైంది. ఢిల్లీలోని అక్బర్‌ రోడ్‌లో కాంగ్రెస్ హెడ్‌ క్వార్టర్స్‌కి వీటిని డెలివరీ చేసింది. జిలేబీలను దేశవ్యాప్తంగా తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేయాలని రాహుల్ చేసిన కామెంట్స్‌ని ఇప్పుడు వైరల్‌ చేస్తోంది బీజేపీ. పనిలో పనిగా ఇలా ఆయనను ఇలా టీజ్ చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram