అమ్మ పేరు ఎందుకు పెట్టుకున్నానో తొలిసారి చెప్పిన సాయిధరమ్ తేజ్

Continues below advertisement

ABP Southern Rising Summit 2024 Live: ఏబీపీ దేశం సదరన్ రైజ్ సమ్మిట్ 2024 లో హీరో సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తనకు యాక్సిడెంట్ తర్వాత ఉన్న పరిస్థితుల నుంచి తన తల్లి పేరును తనకు పెట్టుకున్నారో కూడా చెప్పారు సాయి దుర్గా తేజ్. ఇంకా తన చిన్ననాటి సంగతులను కూడా వివరించారు. తన సినీ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి వివరించారు. వరుసగా 6 ప్లాఫ్‌లను తాను రుచి చూడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే తాను నచ్చని కథకి నో చెప్పడం నేర్చుకున్నానని సాయి దుర్గ తేజ్ వివరించారు. 

అంతేకాక, 2021లో తనకు రోడ్డు ప్రమాదం జరిగి మంచాన పడ్డ సమయంలో తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానో, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటకు వచ్చానో కూడా సాయి దుర్గతేజ్ వివరించారు. తన తల్లి తనకు మరో జన్మ ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram