సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు ...ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ సలహాదారు పిలుపు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాడేపల్లిలో ని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని, చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని అన్నారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని,ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం కానీ సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.