Mumbai Heroine Kadambari Jethwani Interview | AP Police, YSRCP నేతలు ఎలా హింస పెట్టారంటే | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వానీ ఏబీపీ దేశానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంత మంది నాయకులు, ఏపీ పోలీసులు కలిసి ఏ విధంగా తనపై అక్రమ కేసును బనాయించారో ఎలా తనను వేధింపులకు గురి చేశారో వివరించారు. ఓ ఆస్తి విషయమై సంతకాలు ఫోర్జరీ చేశారంటూ కేసు పెట్టడమే కాకుండా లగ్జరీ కార్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చి తనను తనతో తన కుటుంబసభ్యులను అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని విషయంలో తన తల్లితండ్రులను కూడా ఇరికించి మానసిక వేదనకు గురి చేశారని ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, ఆ సమయంలో విజయవాడ సీపీ గా ఉన్నతాధికారి మరికొంత మంది ఏపీ పోలీసులు తనను టార్గెట్ చేసి మానసిక వేధింపులకు గురి చేశారని వీటిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హీరోయిన్ కాదంబరి జత్వానీ విన్నవించుకున్నారు.