Weirdest Job: చదువు, తెలివి తేటలు లేకపోయినా పర్లేదు. పని చేయాలి, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఉంటే చాలు. మీరు కొద్ది రోజుల్లోనే లక్షాధికారి అవ్వొచ్చు. అలా అని ఎలాంటి తప్పుడు పని కూడా చేయాల్సిన అవసరం లేదు. దొంగతనమూ చేయాల్సిన పని లేదు. నిజాయితీగా కొన్ని రోజుల పాటు కంపెనీ వాళ్లు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. ఏంటీ ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా.. అవునండి నిజం. వాళ్లు చెప్పిన పని చేస్తే రోజుకు 20 వేలు ఇస్తారట. 


అసలేమిటీ ఉద్యోగం..?


ఏమీ లేదండి. మీకు కేటాయించిన ఏరియాలో పిచ్చుకలు, పక్షులు రాకుండా చూసుకోవడమే మీరు చేసే పని. రోజంతా అక్కడే ఉండి పక్షలను వెళ్లగొడుతూ ఉండాలి. మీరు ఏం చేసినా ఫర్వాలేదు. కానీ ఒక్క పక్షి కూడా అక్కడ వాలకుండా చూడాలి. ఇలా రోజంతా గనుక కరెక్టుగా మీ బాధ్యతను నిర్వర్తిస్తే చాలు.. సాయంత్రానికి 20 వేల రూపాయలను తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇలా కొన్ని రోజుల పాటు కష్టపడ్డారంటే చాలు లక్షాధికారి అవడం ఖాయం. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన మిస్టర్ చిప్స్ చిప్పీ కంపెనీ ఈ వింత ఉద్యోగం కోసం వ్యక్తులను రిక్రూట్ చేస్తోంది. కేవలం పక్షులను వెళ్లగొట్టడమే పని. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే.
 
కంపెనీ పక్షులను ఎందుకు తరిమికొట్టాలనుకుంటోంది?


మిస్టర్ చిప్స్ చిప్పీ కంపెనీ తయారు చేసేది ఫిష్ చిప్స్. అయితే చిప్స్ తయారీ కోసం సంస్థ చాలా చేపలను నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చేపలను నిల్వ చేసే చోటుకు పక్షలు వస్తూ.. చేపలను తీసుకెళ్లిపోతున్నాయి. అమాంతం ముక్కుతో పట్టుకొని వెళ్తూ.. తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పదో పదిహేనో పక్షులు వచ్చి చేపలు తీసుకెళ్తే ఫర్వాలేదు కానీ.. వందల సంఖ్యలో పక్షలు వచ్చి వేలల్లో చేప పిల్లలను తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే చిప్స్ కంపెనీ ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి వచ్చింది. ఏం చేయాలో తెలియక.. పక్షులను వెళ్లగొట్టేందుకు ఓ వ్యక్తిని పెట్టుకోవాలని చూస్తోంది. మిస్టర్ చిప్స్ చిప్పీ కంపెనీ యజమాని అలెక్స్ బోయ్డ్.. ఈ సరికొత్త ఉద్యోగాన్ని సృష్టించారు.


Also Read: Viral Video: ఆడి చాయ్ వాలా అదిరిపోయే స్టోరీ - లగ్జరీ కారునే టీకొట్టుగా మార్చేసిన యువకుడు!


ఎవరికీ దక్కని ఈ ఉద్యోగంతో విజయం సాధించాడో వ్యక్తి


పక్షుల నుంచి చేపలను కాపాడే వ్యక్తికి.. రోజుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించడంతో.. వందలాది మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం పొంది.. పక్షులను వెళ్లగొట్టడంలో విఫలం అయ్యారు. చాలా మంది ఇందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అంతా విఫలం అయ్యారు. కానీ కోరీ అనే ఓ వ్యక్తి మాత్రం తన అద్భుతమైన టాలెంట్ తో ఈ పనిని సక్రమంగా చేసుకుంటూ లక్షాధికారి అయ్యాడు. కోరీ.. డేగ వేషంలో వచ్చి అక్కడ ఉండగా.. ఎలాంటి పక్షి కానీ అక్కడకు వచ్చేందుకు ధైర్యం చేయలేదు. దీంతో కంపెనీ చాలా సంతోషించింది. అతడిని పర్మినెంట్ ఉద్యోగిగా మార్చేసి రోజులు 20 వేల జీతాన్ని అందిస్తోంది.