ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) తెలంగాణపై దృష్టి కేంద్రీకరించింది. దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ( Aravind Kejriwal ) త్వరలో తెలంగాణలో పర్యటిచే అవకాశాలు ఉన్నాయి.  ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేజ్రీవాల్ హైదరాబాద్‌లోనే ( Hyderabad ) పాదయాత్ర నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ యువతతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది.  ఇందుకోసం తెలంగాణా సెర్చ్ కమిటీని క ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.


రంగు , నోట్లోకి మందు - ఆ ఎమ్మెల్యే హోలీ చూస్తే మైండ్ బ్లాంకే


తెలంగాణకు  ( Telangana ) ఆప్ తరపున బాధ్యతలను సోమ్‌నాథ్ భారతి చూస్తున్నారు. ఆయన చేరికలత ోపాటు పాదయాత్రలను ప్లాన్ చేస్తున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ  పాదయాత్రలు ( Padayatra )  చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ వర్గాలు చెబుతున్నాయి.   తెలంగాణ లో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేసీఆర్ ( KCR ) ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ కారణంగా కేజ్రీవాల్ ముందుగానే తెలంగాణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 


ఇదెక్కడి చోద్యం ! పారిపోవడానికి ప్రయత్నించి, ఆపై లాఠీ లాక్కుని ఆబ్కారీ ఎస్సైపై దాడి


ఇటీవల కేసీఆర్  ఢిల్లీ వెళ్లినప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ ను కలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి భేటీ నిర్వహించలేదు. ఆ తర్వాత ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి ( Somanath Bharti ) కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతి పై విచారణ జరగకుండా తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ వచ్చారని ఆరోపించారు. ఈ ప్రకటనతో కేజ్రీవాల్, కేసీఆర్ మధ్య రాజకీయ సంబంధాలు అస్సలు లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే తెలంగాణలో ఆప్ అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 


బండికి ఆ పని తప్ప వేరేది తెల్వదు, కమలాకర్‌పై పోటీ చేసి గెలవగలరా? కేటీఆర్ ఛాలెంజ్‌


ఆప్ తెలంగాణలో అడుగు పెట్టాలన్న వ్యూహంలో మరో కోణం కూడా ఉందని భావిస్తున్నారు. పంజాబ్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ( Congress ) ప్రత్యామ్నాయం  తామేనని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా ఉంది. పోటీ ఇచ్చే స్థితిలోఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ను దెబ్బకొడితే ఆ స్థానం తమకు వస్తుందని.. ఆప్ అంచనాలు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.