Bhagavad Gita School Syllabus: పాఠశాలలో ఇక భగవద్గీత తప్పనిసరి- ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABP Desam   |  Murali Krishna   |  18 Mar 2022 02:29 PM (IST)

పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్‌గా పెడుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.

పాఠశాలలో ఇక భగవద్గీత తప్పనిసరి- ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఓవైపు హిజాబ్‌పై నిరసనలు జరుగుతోన్న వేళ గుజరాత్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్‌గా చేర్చారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6-12వ తరగతి విద్యార్థులకు తమ సిలబస్‌లో భగవద్గీతను చేర్చినట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.

అందరికీ

విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు ప్రకటించే సమయంలో అసెంబ్లీలో విద్యాశాఖమంత్రి జితు వాఘనీ ఈ మేరకు ప్రకటించారు. భగవద్గీతలోని విలువలు, బోధనలను పిల్లలకు నేర్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల తీసుకువచ్చిన కొత్త జాతీయ విద్యా పాలసీ (ఎన్‌ఈపీ)లో భాగంగా భారత వైవిధ్యమైన చరిత్రను పిల్లలు తెలుసుకోవాలన్నారు. వివిధ మతాలకు చెందిన వారు కూడా ప్రాచీన హిందూ గ్రంథమైన భగవద్గీత బోధించిన నీతి, విలువలను అంగీకరిస్తారన్నారు.

6-12వ తరగతి విద్యార్థుల సిలబస్‌లో భగవద్గీతను చేర్చాం. 6-8వ తరగతి విద్యార్థులకు సర్వాంగి శిక్షణ్ అనే టెక్స్ట్‌బుక్‌లో భగవద్గీత పాఠాలు తీసుకువస్తాం. 9-12వ తరగతి విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ టెక్స్ట్‌బుక్‌లో స్టోరీ టెల్లింగ్ రూపంలో భగవద్గీతను నేర్పించనున్నాం.                                              - జితు వాఘనీ, గుజరాత్ విద్యాశాఖ మంత్రి

పోటీలు

కేవలం తరగతిలో బోధించడం మాత్రమే కాకుండా భగవద్గీతపై ప్రేయర్, శ్లోకాల పఠనం, వ్యాసరచన పోటీలు, డ్రామా, క్విజ్, పెయింటింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పుస్తకాలతో పాటు ఆడియో, వీడియో సీడీలను కూడా ప్రభుత్వం.. పాఠశాలలకు ఇవ్వనుందని తెలిపారు.

Also Read: ISKCON Temple Attack: ఇస్కాన్ మందిరంపై 200 మంది దాడి- ధ్వంసం చేసి లూటీ

Also Read: Stealth Omicron:స్టెల్త్ ఒమిక్రాన్ భారతదేశంలో మరొక వేవ్‌కు కారణం కావచ్చు, చెబుతున్న ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్

Published at: 18 Mar 2022 01:25 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.