రాష్ట్రాల మధ్య గంజాయి సరఫరా చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1,240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి 3 కార్లను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. విశాఖపట్నం సమీపంలోని సీలేరు సమీపంలో నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు వివరించారు.


Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!


మరోవైపు, గుజరాత్‌లో భారీ మొత్తాల్లో మత్తు పదార్థాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. గుజరాత్ ద్వారకలోని మోర్బిలో 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని తెలిపారు. నవ్‌లకి పోర్టు దగ్గరలోని జిన్ ​జుడా గ్రామంలో మత్తు పదార్థాల ముఠా ఉందనే సమాచారం పోలీసులకు అందింది. ఈ ముందస్తు సమాచారంతో అందడంతో ఆదివారం రాత్రి ఏటీఎస్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 


Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..


ఈ క్రమంలో దాదాపు 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. అయితే, గత సెప్టెంబరులో లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తర్వాత ఇంత మొత్తాల్లో డ్రగ్స్ పదార్థాలను పట్టుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Also Read: Nalgonda: పట్నం వెళ్లిన భార్య.. ఇంతలో కత్తిపీటతో గొంతు కోసుకున్న భర్త, ఏం జరిగిందంటే..


Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు


Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..


Also Read: AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలు ప్రారంభం..


Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి