Telangana News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన జరిగింది. గవర్నర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. 


గవర్నర్ వాహనం శంషాబాద్‌ విమానాశ్రయానికి దగ్గర్లోకి రాగానే... ఓ కారు సడెన్‌కు ఎడమ వైపునకు తిరిగింది. అకస్మాత్తుగా ఎదురుగా ఉన్న కారు ఒక్కసారిగా ఎడమవైపునకు తిరగడంతో గవర్నర్ కాన్వాయ్‌లోని కార్‌ డ్రైవర్‌ కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో ముందుగా వెళ్తున్న కారు సడెన్‌ బ్రేక్‌పట్టారు. ఆ కారును వెనుక నుంచి వస్తున్న కార్లు ఢీ కొట్టాయి. దీంతో మూడు  కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో గవర్నర్ దత్తాత్రేయ క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఎండీవర్ కారుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. 


Also Read: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు


Also Read: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ - త్వరలోనే పనులు ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన