Dead Frog In Chicken Biryani In Hyderabad IIIT Mess: ట్రిపుల్ ఐటీ మెస్‌లో పెట్టిన చికెన్ బిర్యానీలో చచ్చిన కప్పను ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగించింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని (Gachibowli IIIT Mess) కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన చికెన్ బిర్యానీలో చనిపోయిన కప్ప కనిపించింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మెస్ నిర్వాహకులు నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెస్ ఇంఛార్జీకి ఫిర్యాదు చేశారు. బిర్యానీలో చనిపోయిన కప్ప ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటు, ఈ విషయాన్ని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు.




Also Read: Kishan Reddy: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ - త్వరలోనే పనులు ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన